Showing posts with label రాజకీయం. Show all posts
Showing posts with label రాజకీయం. Show all posts

మనమే! అయినా నీది నీదే...నాది నాదే.

Back in late 19th century there lived a scientist Boltzman who went on to frame the famous "Law of Entropy" for predicting atomic behavior.. this law,in other words, states that
"In an isolated system the entropy (disorder) always reaches its maximum"

బోల్‌ట్జ్‌మెన్ మహాశయుడి సిద్ధాంతం ఏంటంటే  ఒక అణు/పరమాణువుల సమూహానికి  బాహ్య శక్తి ప్రవహించనపుడు ఆ సమూహంలోని ఒద్దిక తగ్గుతూ గందరగోళం పెరుగుతూపోతుందీ అని. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సిద్ధాంతాన్ని ఆయన సామాజిక వ్యవస్థలకూ, మానవ సంబంధాలకూ అన్వయించాడు.
కొన్ని ఆశయాలు/నమ్మకాలు/ఇష్టాల ప్రాతిపదికన ఏర్పడిన ఏ వ్యవస్థ/సంబంధం అయినా దాన్ని అలాగే పట్టివుంచగల శక్తి (ప్రేరణ), commitment I'd say, లేనపుడు  ఆ వ్యవస్థ/సంబంధం కాలక్రమంలో నిర్వీర్యమైపోతుంది అని భావించాడు.

******************************************************

ఒక దేశంలోని ప్రజలను కలిపి ఉంచేది భాష అని సిద్దాంతీకరించి ఉద్యమాలు చేసి మన తెలుగు వాళ్లము ఒక రాష్ట్రంగా ఏర్పడటమే కాకుండా ఆ ప్రాతిపదికన మరిన్ని రాష్ట్రాల ఏర్పాటుకు కారణమయ్యాము.  ఈరోజు అదే భాషను ఒక సాకుగా చూపించి ఒకొళ్లకొళ్ల మధ్య మానసికంగా  Berlin wall కట్టేసుకొని, political గా విడిపోతున్నాం.

అయస్కాంతపు సజాతీ ధృవాల్లాగా కలిసి ఉండటం వీలుకాక విడిపోతే బాధపడాల్సిన అవసరం లేదు. కాని కలిసి ఉండటమనే విలువ తెలియక, చేతకాక  అలా ఉండేందుకు వీలుకానటువంటి పరిస్థితి కల్పించుకొని విడిపోతున్నాం. ఈ mindset ఉన్నాక అభివృద్ధిలో అందలమెక్కితే ఎంత అధః పాతాళానికి పడిపోతే ఎంత!

ఈ సందర్భంగా ఓ మిత్రుడి ఆవేదనను పంచుకుంటూ..,

 నిన్ను రక్షించుకోలేకపోయిన దౌర్భాగ్యపు జాతి మాది. క్షమించు తెలుగు తల్లీ, క్షమించు! 


with pity for all those who are incapable of looking beyond numbers, figures of a thing called development .







--A Telanganite but not its supporter
(If identity matters)




మేరా భారత్ మహాన్

భారత ప్రభుత్వంవారికి,
అయ్యా  ఈరోజు మీకు శుభాభినందనలు తెలియజేయడానికి నాకు నోటమాట కరువౌతోంది. మొన్నీమధ్యనే జరిగిన ముంబాయి పేలుళ్లను మరవకముందే రక్తసిక్త చేతులతో పట్టుబడ్డ కసబ్‌గారు అథిదిగృహం లాంటి జైలులో పట్టుమని ఓ పదికేజీల బరువు పెరగకుండానే మళ్ళి పేలుళ్లు జరిగాయంట!  సంతోషం. నావొళ్లు పులకించిపోయింది. మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా భావించే ఉగ్రవాదులకు మన రక్ష్యణా వ్యవస్థ, గూఢచర్య వ్యవస్థ మరీ తిసికట్టుగా తయారైయ్యేట్టు చేసినందుకు మీకు శతకోటి వందనాలు. పార్లమెంటు మీద దాడి చేసిన అఫ్జల్‌ను, రె‌డ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కసబ్‌ను భవిష్యత్తులో పట్టుబడబోయే మరేయితర ఉగ్రవాదినో సిగ్గు-శరం లేకుండా ఉంటూ ఏమి చేయలేని మీ రాజనిరతికి నా జోహార్లు. ఇవాల్టి ఈ పనికి పైలోకంలోని వందలాది ఉన్నికృష్ణన్లు, కామ్టేలు, కర్కరేలు ఆనందభాష్పాలు రాలుస్తుంటారు. మీకు హ్యాట్సాఫ్.


ఏదేమైనా సారూ మనకి ఈసారి కూడా అదృష్టం కలిసిరావాలని కోరుకుందాం. ఏ రాముగాడో, సోమూగాడో సంఘటనా స్థలానికి వెళ్ళేలా చేద్దాం. 
వాడిచేత ఓ బ్రహ్మాండమైన సినిమా తీయిద్దాం. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదం పై మనం జరిపే పోరుకు అందరూ మద్దతివ్వాలని కోరుకుందాం. సొల్లు కబుర్లు చెప్పుకోడానికి వీలయ్యే దైపాక్షిక చర్చలకు సానుకూల వాతావరణం కలగాలని కోరుకుందాం. ఎంచక్కా మన మంత్ర్లులు వాళ్ల అనుచరగణం టీవీల్లో, పేపర్లలో దర్జాగా పబ్లిసిటీ ఇప్పించుకోవచ్చు. నా భ్రమగాని ఈ పాటికే మీ మేనిఫెస్టో లోని సగటు మనిషి/ ఆమ్ ఆద్మీ/common man ఈ బాధ్యత తీసుకొని ఉంటాడు. రేప్పోద్దున చూడండి ఏ భయం లేకుండా ముంబాయ్ రైళ్లలో, బస్సుల్లో ప్రయాణం చేస్తాడు. ఛాయ్ బండ్ల దగ్గర సమోసాలు తింటాడు. ఉగ్రవాదులకు మేము భయపడము అని వార్తా ఛానల్లు ఊదరగొట్టుకునేలా చేస్తాడు. ఆ పేరుతో మనందరం చంకలు గుద్దుకొవచ్చు. ఆ పిచ్చి ఛానళ్లకు అసలు సంగతి తెలీదు, పనికెళ్లకపోతే తిండి దొరక్క చస్తాడు ఆ సగటు మనిషి. దానికన్నా బాంబులు ఉంటాయో ఉండవో అని 
అనుమానపడుతూ, తననుతాను సంబాలించుకుంటూ వీధుల్లో తిరుగుతుంటాడు. సగటు మనిషికి అలాంటి మహర్ధశ పట్టించిన మీకు ఎన్ని కితాబులిచ్చినా తక్కువే.

కొన్ని రోజులపాటు న్యూస్‌పేపర్లు, టీ.వీ ఛానళ్లు మీమీద బురద జల్లుతాయి. పోలీసు వ్యవస్థను నీరుగార్చారని, సరిపడ నిధులు  ఇవ్వలేదని. మీరేమి వాటిని చెవికెక్కించుకోవద్దు. పోలీసులను నేతల ఇళ్లదగ్గర, సమావేశాల దగ్గ్రర  కాపలా కుక్కల్లా పెట్టేసుకోండి. ఎదురు మాట్లాడినవాడి పీక నొక్కడానికి వాడండి. ప్రతిపక్షం గతజన్మలో చేసిన అవినీతితి గురించి, తప్పొప్పుల గురించి యేళ్లతరబడి ఉపన్యాసాలు దంచండి. ఎవరైనా ఓ ఇంటిపై దాడిచేస్తే, ఆ ఇంట్లో మగాడు ఏం చేయలేకపోతే వాడికి గాజులు తొడిగి మూల కూర్చోబెడతారు. మీమీద ఉన్న అమితమైన వాత్సల్యం, అభిమానం, ప్రేమ కొద్ది మేమా పనులు ససేమీరా చేయం. దర్జాగా ఏలుకోండి, మమ్మల్ని దోచుకోండి. ఇలాంటి దాడులు జరిగినపుడు ఏవో పదో పరకో ప్రాణాలు పోతాయ్. వెధవది గాల్లో దీపాల్లాంటివి ఆమ్ ఆద్మీ ప్రాణాలు మీరు దేశానికి చేయబోయే విశాల ప్రయోజనాలకంటే ఎక్కువకావు. నిస్సిగ్గుగా ఉండండి. మీరు మాకు దొరకడం మా పూర్వజన్మ సుకృతం.

మేరా భారత్ మహాన్. మేరా నేతా మహాన్.

PS: అయ్యా ఉగ్రవాదులూ తమరు ఎంతో కష్టనష్టాలొనర్చి, పెద్ద పెద్ద ప్రణాళికలు వేసి చిన్నచిన్న బాంబులు పెడుతున్నారు. ఇకపై అంత కష్టం తీసుకోకండి. ఎక్కడ దాడి చేయనున్నారో నేరుగా మా ప్రభుత్వానికే తెలియజేయండి. మీకు సకల సదుపాయాలు కల్పిస్తుంది. ఒకవేళ పోలీసులో కమేండోలో అనవసర సాహసం చేసి పట్టుకుందనుకోండి మీరు ఈ దేశానికి చేసిన మహత్తర సేవకుగాను మీకు దేశంలో ఎవరికీలేని రక్షణమధ్య రాజమర్యాదలు ఉంటాయి. ఆ బంగారు అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. కాకపోతే ఒక్క విన్నపం, దేశ రక్షణ అంటే పవిత్రమైన పని అని ప్రాణాలిచ్చైనా దీని సార్వభౌమత్వాన్ని కాపాడాలని సరిహద్దులోని మా వెర్రి సిపాయిలు, పోలీసుల్లో కొందరు అమాయకులు అనుకుంటున్నారు. కాబట్టి మీరు వచ్చే సమయంలో మా గవర్నమెంటువారికి ఆ సిపాయిలను, పోలీసులను కాసేపు తప్పించమని చెప్పండి. పాపం వారు మధనపడకుండా ఉంటారు. ఎప్పటిలాగే మేము మీ రాకకై ఎదురుచూస్తూ, మీ చేతుల్లో ప్రాణాలొదలడానికి సిద్దంగా ఉంటాం

ఇట్లు,
సగటు మనిషి.

ఇంత బేవార్స్‌గాల్లేంట్రా బాబు

అసలే రాష్ట్రం తుఫానుతో అల్లాడిపోతుంది. అందులో నష్టపోయినవాళ్లకు ఉన్న బాధలు చాలవన్నట్లు ‘ఎలావుంది’ అంటూ ఫినాయిల్ తాగే ఫేసులేసుకొనొచ్చే నాయకులు. ఆల్లేమైయినా ఆరుస్తారా తీరుస్తారాంటే అదీలేదు, మెయిన్‌ ఎడిషన్ ఫ్రంట్‌పేజి ఫొటొకోసం నోటికేదొస్తే అది వాగిపారేయడం.
వరదతాకిడి గురైన నెల్లూరు జిల్లాలో పర్యటించిన మన ‘డైనమిక్‌’ మాజి CM బాబు తన పర్యటనలో ఈ స్టేట్‌మెంట్ ఇచ్చాడంటా
"రోశయ్య ఆకాశంలో తిరుగుతూ తుఫాను నష్టాన్ని తెలుసుకుంటుంన్నారు...ఆకాశంలో తిరిగితే ఉలవపాడులో మామిడి నష్టం తెలుస్తుందా..? బొడ్డువానిపాలేలో పొగాకు నష్టం తెలుస్తుంద..? కళ్లాల్లో తడిసిన వరి సంగతి తెలుస్తుందా..? బొప్పాయి రైతుల కష్టాలు తెలుస్తాయా..? పత్తి రైతుల ఇక్కట్లు తెలుస్తాయా..?"
 అసలు ఈయనగారు బుద్దుండే ఈ మాట మాట్లాడాడా అని కాసేపు బుర్రగోక్కున్నా. CM హెలికాప్ట్రర్‌లో కాకపోతే ఎడ్లబండిలో వస్తాడు, అయితే ఏంటట వరద నష్టం అంచనా వేయడం, నష్టపోయినవాళ్లకు స్వాంతన చేకూర్చడం ముఖ్యంగాని!
బాబుగారి మాట విన్నాక అదేదో సినిమాలో సన్నివేశం గొర్తొచ్చింది. అక్కడకూడా సేమ్ scene వరదలొస్తే ముఖ్యమంత్రో ఇంకొకల్ళో చూడ్డానికి వెల్తాడు. ఇందులోకూడా ప్రభుత్వాన్ని ఇరుకునపెడదామని ప్రతిపక్షనేత తన అసిస్టేంట్లతో ఇలా అంటాడు " ఒరేయి రేపు గనక వాడు రైలులో పరామర్శిండానికి వస్తే మన పేపర్లో ‘జనాలు అల్లాడిపోతుంటే తాపిగా రైలులో వచ్చిన CM’ అని హెడ్‌లైను పెట్టేయి. అదికాక హెలికాప్ట్ర్‌ర్లో వస్తే ‘జనం నేలమీద బాధలు పడుతుంటే గాల్లో తిరుగుతూ వచ్చిన CM' అని రాసెయ్." అచ్చం అలాగే, తొమ్మిదేళ్లు CMగిరి వెలగబేట్టి ఇప్పుడు ఫక్తూ లోకల్ చిల్లర పొలిటీషియన్‌లాగా ఆ అర్థం పర్థంలేని వ్యాఖ్యలేంటొ ఈయనకు. పొయినసారి అసెంబ్లీలో ‘కావాలనే అబద్దం చెప్పా’మన్నందుకు వచ్చిన చీవాట్లు చాలవేమో. ఈయనగారు బాధ్యతాయుతమైన ప్రతిపక్షపార్టినేత. ఏం ఖర్మరా దేవుడా!! అన్నేళ్ళు CMగా వుండి, అంతకన్నా ఎక్కువకాలం రాజకీయాళ్లో కీలకపదవుల్లోవుండి ఈయన సంపాదించిన ‘విజ్ఞత’ ఏమైనట్టు?
ఈయనగారికి తోడు తానాతందానా బామ్మర్ది, ‘చరిత్ర సృష్టించాలన్నా మేమే, ఆ చరిత్ర తిరగరాయాలన్నామేమే’ అంటూ చరిత్ర సృష్టించిన పార్టికి ‘అవకాశం ఇస్తే’ సారథినౌతా అని డైలాగులు. తాతలు నేతులు తాగితే ఈళ్ల మూతుల వాసన ఎవడిక్కాలంట!


మన మెగానటుడిగారి రూటే సపరేటు. ఎంతసెపు ఆ సామాజిక న్యాయం, సామాన్య శాస్త్రం, నేనేం చేయాలో ప్రజలే చెప్తారు అని చెప్పుకుపోవడం తప్పిస్తే ఇంతవరకు ఒక్క అంశంమీద మా పంథా ఇదిఅని చెప్పిందిలేదు. అసెంబ్లీలో చేసిన performance చాలనట్టు రాజ్యసభక్కూడా వెళ్తార్ట. అవకాశం వినియోగించుకోవడంలో తప్పులేదుగా..నాక్కూడా అవకాశం వస్తే ఈయనకోటి చెప్పాలనుంది, ‘అయ్యా మీరంటే ఒకనటుడిగా మాకు ఇంకా చాలా గౌరవముంది.రాజకీయాల్లోకొచ్చి తలాతోకలేని నిర్ణయాలతో,మాటలతో దాన్ని పోగొట్టుకోకండి. టైం తీసుకున్నా ఫరవాలేదు  మీరు చేద్దామనుకుంటున్న ప్రజారాజకీయలపైన అవగాహన వచ్చాకే రండి’ అని. ఎన్నటికి కుదిరేనో.

అధికారపక్షం  చిన్నబాబుది ఇంకో స్టయిలు. ధరలుపెరిగి, పనుల్లెక పంటల్లెక తిండిలేక జనమేడుస్తుంటే అయ్యపోయిన సుమారు ఏడెనిమిది నెలల తరువాత ఓదార్పు యాత్రంట. నవ్వుకోడానిక్కాకపోతే ఇప్పుడు  ఆ పోయినాయనని తల్చుకొని ఎవడు బాధపదుతున్నాడొ?, వాళ్ల జీవితం మీది వాళ్లె బాధపడేవారు తప్పిస్తే. పైపెచ్చు ఆ బాధపడే వర్గమేదో ఆయన చనిపొయినప్పుడే రికార్డు లెవెల్లో పోయారుకదా. చూస్తూంటే శవంమీద చిల్లర ఏరుకునేట్లు కనిపిస్తుంది యవ్వారమంతా. బాబుగారు ‘ఫ్యూచర్ ముఖ్యమంత్రి’. హ్మ్ విధి వైపరిత్యంకాకపోతే ఏంటి ఇది!!  ఇంతచేసినా బాబుగారి బాజా భజంత్రీలకు కొదవేలేదు
" జనం జగన్‌తో ఉన్నారండి, వాళ్ల మనసులో జగనేఉన్నాడు.."
"రెడ్దిగారిలో ఎవైతే లక్షణాలుండేవొ అవన్ని జగన్‍లోకనపడ్డాయి నాకు"
"జగన్ జనం గుండేల్లో వున్నాడండి.."

ఛీ... ఇంత దరిద్రమేంట్రా బాబు అనిపిస్తుంది తలచుకుంటే.
భగవంతుడా....ప్లీజ్ సేవ్ మై పీపుల్‌



మై తెలుగువాలా హై-2

ఎవరివాదన ఎలావున్నా విషయంతేలీని ‘కుహనా’గాళ్ల గొడవ రోతగావుంది. తెలుగు, ఆంధ్రము వేరు  కాబట్టి తెలంగాణా, ఆంధ్ర వేర్వేరు రాష్ట్రాలవడంలో తప్పులేదనే మహానుభావులనుండి మేమొ మీకు తినడం నేర్పించాం ఇప్పుడు తెలంగాణానుండి వెళ్ళిపోమంటే మీరు బాగుపడనే పురాణపురుషులున్నారు. లెక్కలు పత్రాలంటూ వాదించే వారికి కొదవేలేదు. చూడండి మా బతుకులు అత్యంత దరిద్రంగావున్నాయనొకరు, అబ్బే అలాంటిదేంలేదు ఇక్కడ చూడు..... మనం నిండువెన్నల చంద్రుడిలా వెలిగిపోతున్నాం మాకన్నా మీరు మహబాగా వెలిగిపోతున్నారనొకరు. తెలుగునేలలో ఎవరుకూడా ‘ప్రాంతీయత’ కారణంగా దుర్భ్హరంగాకాని సంపన్నంగాకాని బ్రతకడంలేదు. ఇక్కడవున్నవి అసమానతలు, వాటిని పెంచిపోషిస్తున్నది పదవులకోసం,ముడుపులకోసంమాత్రమే బతుకీడుస్తున్న నాయకగణం, ఎంత దగాపడినా మళ్ళి ‘అన్యథా శరణఁనాస్తి త్వమేవశరణం మమః’ అంటూ అదే నాయకుల ఉచ్చులో పడుతున్న సామాన్య ప్రజలు.

మనలో మనకు ఐక్యతలేకపోవడమే ఈ పరిస్థితికి మూలమా అని ప్రశ్నించుకుంటే బుర్రలో ఏదోమూల అవుననె సమాధానం వినపడుతుంది నాకు. కారణం ‘భాష, దాని అనుబంధాలైన social lifestyle’ అంటుంది. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో మొదటి రాష్ట్రం అయివుండి, పక్కనవున్న రాష్టాన్ని అదే కారణంచేత విలీనం చేయించుకొన్న ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలను ఒకే ‘తెలుగు’ గొడుగుకిందకు తేలేకపోయాం. పూర్తిగా ఒకరికొకరు ఉత్తర-దక్షిణ ధృవాల్లాగా వున్నారనికాదు కాని ఇన్నేళ్లుగా time తీసుకువచ్చిన సఖ్యత తప్ప ( ఓ గదిలో ఎక్కడేక్కడినుండో తెచ్చిన కోతుల్ని తెచ్చిపెడితే ముందు నానా పెంట చేస్తాయి...సమయం గడుస్తున్నకొద్ది వాటిల్లొ ఓ harmony వస్తుంది, కొట్టుకోకుండా వుంటాయి. వాటిల్లొ ఏఒక్కదానికి ‘కోతిబుద్ది’ పుట్టినా మళ్ళి అల్లరి మొదలు..అలావుంది పరిస్థితి) నిజంగా కలుపుగోలులేదు. మనల్ని ఐక్యంచేసిన భాషకి తిలోదకాలిచ్చాం. ఇప్పుడు తెలుగు టెలుగైపోయింది పొరుగు రాష్ట్రపు సోదరుడికి తన భాషమీదున్న అభిమానం మనకు కరువైంది. పోని సాంస్కృతికంగానైనా దగ్గరిచేసే ప్రయత్నాల్లేవ్‌. ప్రాంతీయ uniqueness పేరుతో తెలుగువాళ్లం ఒక్కరంకాలేదు. తెలంగాణోడికి ఇక్కడ రజకార్ల పోరాటం, నిజాం తెలుసు ఆంధ్ర-సీమ జిల్లాల యాస వేరని తెలుసు, అవతల పక్కా అంతే. కాని వేరుగావున్నప్పుడు మనం ఎలా జీవిచాం, అసలు తెలుగువాళ్ల మధ్య ఈ అంతరం ఎందుకు వచ్చింది, ఒకళ్ళుగా వున్నవాళ్లు ఎలా వేరుపడ్డాం ఎలా ఒక్కరయ్యాం ఎంతమందికి ఎఱక.తెలిసిందంతా 1956లోఆంధ్రా ఆంధ్రప్రదేశ్‌ అవడంచేత ఒక రాష్ట్రంలోవుంటున్నాం.  భేదం అంతరించేందుక్కాకుండా దాన్ని చూసి పౌరుషాలగడ్డనో,సాహితిపుణ్యభూమనో  ఎవరికి వాళ్లు మీసాలు మెలేసుకున్నారు. యాసని-ప్రాంతీయ జీవనానికి ఓ రంగేసి ఈ ప్రాంతం అంటే ఇలాంటి మనుషులు మాత్రమే అని అర్థమిచ్చేలా అలుపెరుగని కృషిచేస్తున్న సినిమారంగాన్ని గూరించి చెప్పనక్కరలేదు ( ఈ మాట అనడానిక్కారణం భారతదేశంలో హింది తరువాత తెలుగు సినిమా మార్కేటే ఎక్కువ. సినిమా చూసి హీరోయిజం/త్యాగాలు/సేవలు చేసేవాళ్లుండకపోవచ్చు కాని దాన్ని బుర్రలో పెట్టుకొనే వాళ్లు చాలానే)



అభివృద్దిని పంచకుండా అంతా ఓ దగ్గర కుప్పపోసాం. విలీనమైనప్పుడు ఈ రెండు రాష్ట్రాల భౌగోలిక స్థితిగతులు వేరు, వనరుల వినియోగతీరు వేరు,  వీటిని సమన్వయపరచడానికి తయారుచేసుకున్న ఒప్పందాలు తుంగలోతొక్కబడ్డాయి. కారణాలు విశేష్యమైనవి కాకపోవచ్చు ‘ప్రాంతీయ’భావం అప్పుడు లేకపోవచ్చు కాని అది జరిగిన ప్రదేశం మాత్రం విశేష్యమైనదే. మనం పొరుగునవుండి తగవుపడకుండా పరస్పరం సహరించుకుంటూ అభివృద్ది చెందుదామని ఒకటైనవారం.అలాంటి చోట అసమానతలకు అవకాశం ఇప్పించడం మనం ఏర్పరుచుకున్న వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. దొంగ చేతికి కన్నంవున్న ఇల్లు దొరికినట్లు మనం  అప్పుడు చేసిన పొరపాట్లు ఇవాళ బుర్రలేని తిక్కసన్నాసులు ఎంత వీలైతె అంత స్వప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నారు.


అసలు 1969లోనే మహత్తరమైన సదవకాశం మనకువచ్చింది. వేర్పాటువాదం లేచిసద్దుమణిగినప్పుడు అందుక్కారణాలను వెతికి పరిష్కరించాల్సింది. ఓ చారిత్రిక అవకాశం రాజకీయ బురదలో కనుమరుగైంది. కొంతమేరకు తెలుగుదనం వికసించి ‘తెలుగువార’నే గుర్తింపు ప్రాంతీయ పార్టీఐన తెలుగుదేశం హయాంలో వచ్చింది.అలానే వుంటే బహుశా వేర్పాటువాదం కాలగర్భంలో కలిసిపోయేదేమో. పదవిరాలేదని ఒక్కడు మొదలుపెట్టిన యాగి అధిష్టానాన్ని సంతృప్తి పరచడానికి ఎంపీలను టోకుగా ఇచ్చేసిన ఇక్కడ భగవంతుడి పాలనలో పరిపూర్ణమైంది. ఒకవేళ వై.యెస్‌.ఆర్ వుండివుంటే KCR ఇంత సీన్ చేసేవాడుకాదేమో నెల-నెలన్న రోజులకోసారి చెప్పే సోది తప్పించి.


ఇప్పుడున్న సమస్యకు JPగారు ఓ విధంగా మంచి పరిష్కారమే సూచించారు "నిజంగానే విడిపోవాలనుకుంటే అలానేకానివ్వండి కాని ఒకళ్ళమీద ఒకళ్ళు విద్వేశాలు పెంచుకుంటూ కాదు,ఇలాంటి తరుణంలో వద్దు. కలిసేవుందాముకుంటే ప్రాంతీయ అసమానతలు రూపుమాపడానికి రీజనల్‌ కమిటీలు వేసుకుందాం, అధికార వికేంద్రీకరణ జరుపుదాం". కొట్టుకుంటూ విడిపోవడమో, ఏది తేలకుండా సద్దుమణిగాక మళ్లి తాడుబొంగరంలేని పూటకోమాటమార్చేటోల్ల చేతిలో విషయం నలగకుండా చూసుకుందాం


మా తెలుగు తల్లికి మల్లెపూదండా,
మాకన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి

గలగలా గోదారి కదిలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను....

నేను తెలుగువాడిగా పుట్టాను, తెలుగువాడిగానే వుంటా. స్వప్రయోజనం కోసం తెలంగాణాఅనో ఆంధ్రమనో అడ్డమైన గడ్డికరిచే సన్నాసులను నే లెక్కచేయను. 
మై తెలుగువాలా హై
---------------------------------------------------------------------------------------------------------------

PS- శరత'కాలమ్’: ఏం కెలుకుడుకి కొత్తపదం కనిపెడితివోగానిబాసు......దాన్ని కాస్తా కొత్త తిట్టుకింద వాడుకుంటూన్నారు జనాలు. కామేడికి మొదలుపెట్టింది కాస్తా సీరియసైపోయింది. pants off to you.....

మై తెలుగువాలా హై-1

ఎవరేమన్నాగాని
నేన్ తెలుగోడ్ని బై
నేను తెలుగువాడిని
నేను తెలుగోనబ్బా

ఓకె, పాయింట్‌కి వస్తున్నా. గతకొద్ది వారాలుగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలింగించేవిగా ఉన్నాయి. కలిసుండలేం విడిపోదాం అనొకరు, లేదు సమైక్యంగావుందామని మరొకరు చేస్తున్న ప్రయత్నాలు,ఉద్యమాలు ఒకరిపట్లఒకరికి నష్టం కలిగించేవిగావున్నాయి.తెలంగాణగూరించి ఉద్యమించేవాళ్ళు సీమాంధ్ర నాయకుల వైఖరిపట్ల కాకుండా అక్కడి సామాన్య ప్రజలపట్ల కూడా వ్యతిరేకంగా ప్రవర్తించడం, సమైక్యంఅనేవాళ్ళు కేవలం కలిసుందామని మాత్రమే అని పరిష్కారం చెప్పకపోవడం ఇలాంటివి అసలు విషయాన్ని జఠిలం చేస్తున్నాయనిపిస్తుంది.
ఈ సంఘటనలక్రమంలో నాకు కల్గిన అభిప్రాయాలను, కొన్ని ప్రశ్నలను ఇక్కడ పెడుతున్నాను.

సమైక్యవాదులకు

౧.తెలంగాణావాదులు తమ సమస్యకు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం మాత్రమే పరిష్కారం అని నిర్దిష్టంగా చెప్పినప్పుడు, మీ సమస్యల పట్ల అవగాహనా,సానభూతీవున్నాయి అయినా కలిసివుందామంటున్నారు. కలిసివుండి ఆ సమస్యలను ఎలా ఏ విధంగా పరిష్కరిస్తారో ఎందుకు చెప్పలేకపోతున్నారు.

౨.ఉద్యోగాల్లో ప్రాంతాలవారిగా కేటాయింపులకోసం తెచ్చిన GO.610,ముల్కీ నిభందనలు ఎందుకు అమలుకు నోచుకోలేదు. దాని అమలు తెరపైకి వచ్చిన ప్రత్తిసారి జేఏసి ఉద్యమాలు, ఫ్రీజోన్‌ లాంటివి ఎందుకు వస్తాయి. పోనీ 610 GO అమలొ విధానపరమైన నిర్ణయాలు(ఒకవేళ మరొక ప్రాంతానికి నష్టం కలిగేదిగా) తీసుకొనే ఉద్యోగాలు తప్పించి executive level ఉద్యోగాల్లో అయినా అమలైవుంటే KCR లాంటివాళ్ళు ఇంత దూరం వచ్చేవాళ్ళా?


౩.హైదరబాదు: ఎంతసేపూ తెలంగాణా కోరుకొనే వాళ్లు చెప్పే అన్నికారణాలను ఖండించడమేకాని సమైక్యాంధ్ర కోసం పసేలేని వాదన వినిపించేవాళ్లను పట్టించుకునేవాడేడి. ఎందుకంటున్నానంటే ‘సమైక్యం’వినిపించేవాళ్లలో హైదరాబాదుని మేం అభివృద్ధి చేశాం, అభివృద్దిలో సింహభాగం పాత్రపోషించాం , తెలంగాణా ఇచ్చేట్లయితే హైదరాబాదుని కూడా ప్రత్యేక రాష్ట్రం చేయాలనే వాళ్ళని ఏందుకు ప్రశ్నించరు? అంటే మనకు మద్దతిస్తున్నాడు కాబట్టి వాళ్ళుద్దెశేమైనా ఫరవాలేదనుకుంటున్నారా- అలాగైతే KCR సోనియాను పొగిడినా,తిట్టినా తప్పులేదు, మీ రాతలకి విలువలేదు.

౪.తెలబాను: ఏ లుచ్చాగాడు( seriously, i mean it) మొదలు పేట్టాడోగానీ తెలంగాణా కావాలనుకునేవాళ్ళను మొత్తం ఈ గ్రూపులో కలిపేసారు. ‘తెలబాను ఓ తెలబాను’ అని పాటలొకటి, మళ్ళీ వాటికి ప్రశంసలు. తెలంగాణావాదులేమైనా తాలిబాన్లలాగా అన్ని ప్రాంతాలు తమ అధికారంలోనే ఉండాలనేమైన అన్నారా. విలీనమైన రాష్ర్టం వద్దు తమని తాము పాలించుకునేలా ప్రత్యేక రాష్ర్టం కావాలనే అన్నారుగా, పోనీ ఇప్పటి వరకు ఎరైనా తెలంగాణేతరులకు ప్రాణహాని తలపెట్టారా. ప్రభుత్వ, కొన్నిఅతితక్కువ (అది కూడా అది-ఇది అని చూడని విధ్వంస పరంపరలో) సంఘటనల్లో సామాన్య ప్రజల ఆస్తుల ధ్వంసం జరిగింది. భయాందోళనలు కలిగించినమాట వాస్తవం. అయితే ఒకటి ‘భాగో-జాగో’ అని నాయకులు అన్నప్పుడు పెద్దగా ప్రమాదంగా పరిగణించలేదు, ఖండించడం తప్పిస్తే. బస్సు దహనాలు, ఆస్తుల ధ్వంసం జరిగినప్పుడు ఒక్క సీమాంధ్ర ప్రజలేకాదు తెలంగాణా ప్రజలు కూడా భయపడ్డారు. ఆమాత్రందానికే ‘తెలబాను’ అనేబిరుదు, దాన్ని వాదుకుంటూ వ్యాసాలు.
ఒకవేళ ఈ పదం మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధులు అన్న మాటల తరువాత పుట్టివుంటే,వాళ్ళను ఉద్దేశించి అనివుంటే, అలాఅనడాన్ని ప్రశంశిస్తే అంతగా బాధపడేవాడ్నికాదు. ప్రత్యేకం కావాలన్నందుకే ‘తెలబాను’ పుట్టాడు, దానికి అనుబంధంగా ‘T-ఇడియట్స్’ , దీన్ని విమర్శించే సమైక్యవాది ఒక్కడుండడు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొనే సమైక్యరాగం ఏంటో నాకర్థంకావట్లా.

౫.హింస: ప్రత్యేక ఉద్యమంలో ఉమ్మడి ఆస్తి (బస్సులు, ప్రభుత్వ కార్యాలయాలు) ధ్వంసం అవుతున్నాయి, ఇది ద్వేషపూరిత ఉద్యమం తప్పితే నిజమైన ఉద్యమం కాదని చాలా బ్లాగుల్లో అన్నారు. మీతో నేను ఏకీభవిస్తున్నా-విధ్వంసం సరైందికాదని. ఈ హింసని విమర్శించిన వాళ్ళు సమైక్యోద్యమంలో భాగంగా BSNL ఆఫీసుకి, పోలీసు స్టేషన్లకీ నిప్పు పెట్టినప్పుడు, యూనివర్సిటీలో (SVU అనుకుంటా) labs ధ్వంసం చేసినప్పుడు, ఆయిల్ రిఫైనరీలు ముట్టడించినప్పుడు ఏందుకు నోరు మెదపలేదు. సమైక్యంకోసం చేస్తే అది నిజమైన ప్రబలమైన కోరిక వ్యక్తం చేసినట్లు, తెలంగాణాలొ చేస్తే అది విద్వేషపూరితమైనదా ?

౬.కేసిఆర్: ప్రత్యేక రాష్ర్టం వద్దనుకునేవాళ్ళు విషయం తెలియకపోయినా తెలంగాణావాదానికి వ్యతిరేకంగా మాట్లాడ్డానికి ఓ మాంచి పాయింట్‌. KCRమాత్రమే తెలంగాణా అంటున్నాడంటారు. వాణ్ణి (ఎందుకంటే తెలంగాణాలో తెలంగాణాకొసమే kcrని చాలామంది సమర్థిస్తున్నారుకాని KCRనచ్చికాదు) తిడుతూ మొత్తం తెలంగాణావాదమే లేదంటున్నారు. ప్రత్యేక భావమేవుంటే 2009 ఎన్నికల్లో ఎందుకు ఓట్లు సంపాదించలేదు,గ్రేటర్లో ఎందుకు నిలబడలేదు అని అడిగేవాళ్ళు అసలు 2009 ఎన్నికల్లొ ఎన్ని పార్టీలు తెలంగాణాను తమ ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టాయి, ఎన్ని పార్టీల అధినాయకులు తెలంగాణాకి సానుకూలమి చెప్పాయి, 2004 తరువాత కరీంనగర్ ఉపఎన్నికల్లో సదరు KCR ‘తెలంగాణా’అనే ఒకేఒక ఎజెండాతో పోటిచేసినప్పుడు ఎంత మెజార్టీతో గెలిచాడొ ఆ తరువాత మళ్ళి పోటీ చెసినప్పుడు ప్రజలు అతణ్ణి తిరస్కరించారా తెలంగాణా భావాన్ని తిరస్కరించారా అని ఆలోచించరేం?
ఇప్పుడు KCRకి వ్యతిరేకంగా మాట్లాడే నాయకగణం, యూనియన్లూ,సంఘాలు 2004,2009 ఎన్నికలప్పుడు ఏమయ్యారు? పొత్తుపెట్టుకున్న నాయకులని ఎందుకు నిలదీయలేదు? KCR ప్రవర్తనపైన అతని అంతరంగంపైన మాట్లాడిన సదరు వక్తలు లగడపాటి లాంటి psuedo సమైక్యవాదులగూరించి మాట్లాడరేం?


తెలంగాణావాదులకు
౧. మీరు తెలంగాణా కావాలీ అనేప్రతిసారి ఇంకోప్రాంతపు నాయకుల అధికార వివక్ష గురించి గాకుండా అక్కడి మొత్తం ప్రజలపట్ల వ్యతిరేకంగా ఏందుకు ప్రవర్తిస్తారు. అక్కడి ప్రజలు జీవనోపాది కోసం ఇక్కడికి వచ్చిర్రుగాని వనరులు దోచుకోడంకోసం కాదే, అలావచ్చింది నాయకులు. ఆల్లకు వ్యతిరేకంగా మాట్లాడుండ్రి. గంతేగాని ‘ఆంధ్రవాలా భాగో’, ‘ఆంధ్రోల్లని తరిమిగోడ్తం’ అని ఎవడో అంటె ఏమనరు, తెలంగాణాకు ఎదురు మాట్లాడితే నారాజ్‌ ఐతరు. ఏంది వయా ఇది?

౨. సమజ్‌గాక అడ్గుతున్న ‘ఆంధ్ర బ్యాంక్‌’ అనె పేరువుంటే గది ఆంధ్రోళ్లు పెట్టిందైతదా? దాని ఆఫీసు బర్బాద్‌ చేశిండ్రు. ఏమన్న ధమాక్‌ఉన్న పనేనా. KCR దీన్ని మంచిపనే అంటె సవాల్‌ జేసిన తెంగాణావాదిలేడు. ఏందిబై ఇది.

౩. మొన్న ఉస్మానియాల ‘ సంక్రాంతి పండగకి సొంతూరు పొయ్యేవాళ్ళు మళ్ళి తిరిగి రాకండి’ అన్నరు. గదేమన్న సరైందా? మీ బండ్లకు AP బదులు TG అని పెట్టిండ్రుసరే మంచి పని వేరోళ్లకు నష్టం లేదు. మీ అంతరంగం చెప్పారు. అంతేగాని ఆల్లని రానియ్యం, పారిపోండ్రి అనేదేందివయా...


సశేషం...

ShareThis