ఇంత బేవార్స్‌గాల్లేంట్రా బాబు

అసలే రాష్ట్రం తుఫానుతో అల్లాడిపోతుంది. అందులో నష్టపోయినవాళ్లకు ఉన్న బాధలు చాలవన్నట్లు ‘ఎలావుంది’ అంటూ ఫినాయిల్ తాగే ఫేసులేసుకొనొచ్చే నాయకులు. ఆల్లేమైయినా ఆరుస్తారా తీరుస్తారాంటే అదీలేదు, మెయిన్‌ ఎడిషన్ ఫ్రంట్‌పేజి ఫొటొకోసం నోటికేదొస్తే అది వాగిపారేయడం.
వరదతాకిడి గురైన నెల్లూరు జిల్లాలో పర్యటించిన మన ‘డైనమిక్‌’ మాజి CM బాబు తన పర్యటనలో ఈ స్టేట్‌మెంట్ ఇచ్చాడంటా
"రోశయ్య ఆకాశంలో తిరుగుతూ తుఫాను నష్టాన్ని తెలుసుకుంటుంన్నారు...ఆకాశంలో తిరిగితే ఉలవపాడులో మామిడి నష్టం తెలుస్తుందా..? బొడ్డువానిపాలేలో పొగాకు నష్టం తెలుస్తుంద..? కళ్లాల్లో తడిసిన వరి సంగతి తెలుస్తుందా..? బొప్పాయి రైతుల కష్టాలు తెలుస్తాయా..? పత్తి రైతుల ఇక్కట్లు తెలుస్తాయా..?"
 అసలు ఈయనగారు బుద్దుండే ఈ మాట మాట్లాడాడా అని కాసేపు బుర్రగోక్కున్నా. CM హెలికాప్ట్రర్‌లో కాకపోతే ఎడ్లబండిలో వస్తాడు, అయితే ఏంటట వరద నష్టం అంచనా వేయడం, నష్టపోయినవాళ్లకు స్వాంతన చేకూర్చడం ముఖ్యంగాని!
బాబుగారి మాట విన్నాక అదేదో సినిమాలో సన్నివేశం గొర్తొచ్చింది. అక్కడకూడా సేమ్ scene వరదలొస్తే ముఖ్యమంత్రో ఇంకొకల్ళో చూడ్డానికి వెల్తాడు. ఇందులోకూడా ప్రభుత్వాన్ని ఇరుకునపెడదామని ప్రతిపక్షనేత తన అసిస్టేంట్లతో ఇలా అంటాడు " ఒరేయి రేపు గనక వాడు రైలులో పరామర్శిండానికి వస్తే మన పేపర్లో ‘జనాలు అల్లాడిపోతుంటే తాపిగా రైలులో వచ్చిన CM’ అని హెడ్‌లైను పెట్టేయి. అదికాక హెలికాప్ట్ర్‌ర్లో వస్తే ‘జనం నేలమీద బాధలు పడుతుంటే గాల్లో తిరుగుతూ వచ్చిన CM' అని రాసెయ్." అచ్చం అలాగే, తొమ్మిదేళ్లు CMగిరి వెలగబేట్టి ఇప్పుడు ఫక్తూ లోకల్ చిల్లర పొలిటీషియన్‌లాగా ఆ అర్థం పర్థంలేని వ్యాఖ్యలేంటొ ఈయనకు. పొయినసారి అసెంబ్లీలో ‘కావాలనే అబద్దం చెప్పా’మన్నందుకు వచ్చిన చీవాట్లు చాలవేమో. ఈయనగారు బాధ్యతాయుతమైన ప్రతిపక్షపార్టినేత. ఏం ఖర్మరా దేవుడా!! అన్నేళ్ళు CMగా వుండి, అంతకన్నా ఎక్కువకాలం రాజకీయాళ్లో కీలకపదవుల్లోవుండి ఈయన సంపాదించిన ‘విజ్ఞత’ ఏమైనట్టు?
ఈయనగారికి తోడు తానాతందానా బామ్మర్ది, ‘చరిత్ర సృష్టించాలన్నా మేమే, ఆ చరిత్ర తిరగరాయాలన్నామేమే’ అంటూ చరిత్ర సృష్టించిన పార్టికి ‘అవకాశం ఇస్తే’ సారథినౌతా అని డైలాగులు. తాతలు నేతులు తాగితే ఈళ్ల మూతుల వాసన ఎవడిక్కాలంట!


మన మెగానటుడిగారి రూటే సపరేటు. ఎంతసెపు ఆ సామాజిక న్యాయం, సామాన్య శాస్త్రం, నేనేం చేయాలో ప్రజలే చెప్తారు అని చెప్పుకుపోవడం తప్పిస్తే ఇంతవరకు ఒక్క అంశంమీద మా పంథా ఇదిఅని చెప్పిందిలేదు. అసెంబ్లీలో చేసిన performance చాలనట్టు రాజ్యసభక్కూడా వెళ్తార్ట. అవకాశం వినియోగించుకోవడంలో తప్పులేదుగా..నాక్కూడా అవకాశం వస్తే ఈయనకోటి చెప్పాలనుంది, ‘అయ్యా మీరంటే ఒకనటుడిగా మాకు ఇంకా చాలా గౌరవముంది.రాజకీయాల్లోకొచ్చి తలాతోకలేని నిర్ణయాలతో,మాటలతో దాన్ని పోగొట్టుకోకండి. టైం తీసుకున్నా ఫరవాలేదు  మీరు చేద్దామనుకుంటున్న ప్రజారాజకీయలపైన అవగాహన వచ్చాకే రండి’ అని. ఎన్నటికి కుదిరేనో.

అధికారపక్షం  చిన్నబాబుది ఇంకో స్టయిలు. ధరలుపెరిగి, పనుల్లెక పంటల్లెక తిండిలేక జనమేడుస్తుంటే అయ్యపోయిన సుమారు ఏడెనిమిది నెలల తరువాత ఓదార్పు యాత్రంట. నవ్వుకోడానిక్కాకపోతే ఇప్పుడు  ఆ పోయినాయనని తల్చుకొని ఎవడు బాధపదుతున్నాడొ?, వాళ్ల జీవితం మీది వాళ్లె బాధపడేవారు తప్పిస్తే. పైపెచ్చు ఆ బాధపడే వర్గమేదో ఆయన చనిపొయినప్పుడే రికార్డు లెవెల్లో పోయారుకదా. చూస్తూంటే శవంమీద చిల్లర ఏరుకునేట్లు కనిపిస్తుంది యవ్వారమంతా. బాబుగారు ‘ఫ్యూచర్ ముఖ్యమంత్రి’. హ్మ్ విధి వైపరిత్యంకాకపోతే ఏంటి ఇది!!  ఇంతచేసినా బాబుగారి బాజా భజంత్రీలకు కొదవేలేదు
" జనం జగన్‌తో ఉన్నారండి, వాళ్ల మనసులో జగనేఉన్నాడు.."
"రెడ్దిగారిలో ఎవైతే లక్షణాలుండేవొ అవన్ని జగన్‍లోకనపడ్డాయి నాకు"
"జగన్ జనం గుండేల్లో వున్నాడండి.."

ఛీ... ఇంత దరిద్రమేంట్రా బాబు అనిపిస్తుంది తలచుకుంటే.
భగవంతుడా....ప్లీజ్ సేవ్ మై పీపుల్‌



స్వాతికిరణాలు

నేను చూసిన విశ్వనాథ్‌గారి మొదటి సినిమా సాగరసంగమం. అది చూసిన తరువాత నేను కమలహాసన్‌కు అభిమానినైపోవడమూ, విశ్వనాథ్‌గారి అన్ని సినిమాలు చూడాలనుకోవడమూ, పక్కవాడికి బాధ కలిగినాసరే సంగీతమో,నాట్యమో నేర్చుకోవాలనుకోవడమూ అలా అలా జరిగిపోయాయి.

రొప్పుతూ, మూలుగుతూ ఇన్నాళ్లకు ‘స్వాతికిరణం’ చూసా. నిజజీవిత అనుభూతులకు దగ్గరగా ఉండడంచేత ( మమ్మూట్టి ఈర్ష్య, ధర్మవరపు సుబ్ర్మణ్యం హోటల్లో జరిగే సినిమా చర్చలు, అచ్యుత్ పడే ‘టి’ప్పట్లు వగైరా) సాగరసంగమం,శంకరాభరణం కన్నా బాగా నచ్చింది.  సినిమాలోని పాటలు మరీముఖ్యంగా నచ్చేసాయి. ఈమధ్య ఎప్పుడుపడితే అప్పుడు వింటున్నా ఈ పాటలని. వినడమేంటి పక్కవాళ్లకు కూడా వినిపిస్తున్నా.

అందులో ఒక్కోపాట ఒక్కో ఆణిముత్యం. తేటతెలుగులో ఉండే వాటిని వింటుంటే చెవిలో తేనెపోసినిట్టు అనిపిస్తుంది. అంతమంచి బాణిలనందించిన మహదేవన్‌గారికి, స్వరాన్నిచ్చిన SPగారికి, వాణిజయరాంగారికి, స్వాతిచినుకు ముత్యంలాంటి చిత్రాన్నిచ్చిన విశ్వనాథ్‌గారికి ఎన్ని జోహార్లిచ్చినా సరిపోదు.

పాటల్లో కొన్ని చరణాలు మళ్లీ మళ్లీ వినాలనిపించేంతగావున్నాయి
ఉదా:

" నీ ఆన లేనిదే గ్రహింపజాలునా వేదాలవాణితో విరించి విశ్వనాటకం,
   నీ సైగకానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్యపాలనం..."

"జంగమదేవర సేవలుగొనరా  మంగళదాయక దీవెనలిడరా
సాష్టంగముగా దండముచేతురా..
ఆనతి నీయరా...."

"సున్నిపిండిని నలిపి చిన్నారిగా మలిచి సంతసానమునిగింది సంతులేని పార్వతి
  సుతుడన్నా మతిమరచి శూలన మెడవిరిచి పెద్దరికం చూపే చిచ్చుకంటి పెనిమిటి
  ప్రాణపతినంటుందా బిడ్డగతి కంటుందా...ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటంకన్నా ఘాటైన గరళమిది... గొంతునులిమే గురుతై వెంటనేఉంటుంది.."


కొన్నిసార్లు విన్నతరువాత ఓ పాటలో ఒక ఆశ్చర్యకరమైన సంగతి తట్టింది. ఈ సినిమాలో చాలావరకు పాటలు వాణిజయరాంగారే పాడారు తెలిమంచు తొలిగింది పాటలో రెండు పాత్రలు పాడాల్సివున్నా మొత్తంపాట ఆవిడచేతే పాడించారు. అయితే ‘శ్రుతినీవు గతినీవు’ పాటను జానకి,వాణిజయరాంగార్లతో పాడించారు. గొంతు sharpగా వుంటుందికనుక సినిమాలో చిన్నపిల్లల పాత్ర పాడే పాటలు జానకిగారి చేత పాడించేవారంట అప్పట్లో. దానికి తగ్గట్టుగానే ఆ పాటలో గంగాధరం పాడే భాగన్ని జానకిగారితో, రాధిక పాడే భాగాన్ని వాణిజయరాంగరితో పాడించారు.
పాట సందర్భానికొస్తే గంగాధరం కట్టిన కొత్త బాణిని రాధికకు వినిపించాలి, ఇక్కడ గంగాధరం గురువు రాధిక ఆ బాణిని అనుసరించాలి.
పాట మొదలయేప్పుడు వాణిజయరాం (రాధిక) బాణిని తప్పుగా అందుకుంటుంది, జానకి (గంగాధరం) పెద్దవారుకనుక గురువు స్థానం తీసుకొని ఆ తప్పుని సరిచేస్తూ ఎలాపాడాలో చెబుతుంది.
మీరూ ఓసారి చూడండి



జానకిగారితో పాడించడం లాజికల్‌గానూ, అంతర్లీనంగానూ మంచి ఆలోచన అనిపిస్తుంది.

ఏంటి కొండను తొవ్వి ఎలకను పట్టాననిపిస్తుందా...., అనిపించినా ఫరవాలేదులేండి మీకు ఓ మంచి పాటను వినిపించాను...చాలు.

ShareThis