Showing posts with label ఆలోచనలు. Show all posts
Showing posts with label ఆలోచనలు. Show all posts

మనమే! అయినా నీది నీదే...నాది నాదే.

Back in late 19th century there lived a scientist Boltzman who went on to frame the famous "Law of Entropy" for predicting atomic behavior.. this law,in other words, states that
"In an isolated system the entropy (disorder) always reaches its maximum"

బోల్‌ట్జ్‌మెన్ మహాశయుడి సిద్ధాంతం ఏంటంటే  ఒక అణు/పరమాణువుల సమూహానికి  బాహ్య శక్తి ప్రవహించనపుడు ఆ సమూహంలోని ఒద్దిక తగ్గుతూ గందరగోళం పెరుగుతూపోతుందీ అని. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సిద్ధాంతాన్ని ఆయన సామాజిక వ్యవస్థలకూ, మానవ సంబంధాలకూ అన్వయించాడు.
కొన్ని ఆశయాలు/నమ్మకాలు/ఇష్టాల ప్రాతిపదికన ఏర్పడిన ఏ వ్యవస్థ/సంబంధం అయినా దాన్ని అలాగే పట్టివుంచగల శక్తి (ప్రేరణ), commitment I'd say, లేనపుడు  ఆ వ్యవస్థ/సంబంధం కాలక్రమంలో నిర్వీర్యమైపోతుంది అని భావించాడు.

******************************************************

ఒక దేశంలోని ప్రజలను కలిపి ఉంచేది భాష అని సిద్దాంతీకరించి ఉద్యమాలు చేసి మన తెలుగు వాళ్లము ఒక రాష్ట్రంగా ఏర్పడటమే కాకుండా ఆ ప్రాతిపదికన మరిన్ని రాష్ట్రాల ఏర్పాటుకు కారణమయ్యాము.  ఈరోజు అదే భాషను ఒక సాకుగా చూపించి ఒకొళ్లకొళ్ల మధ్య మానసికంగా  Berlin wall కట్టేసుకొని, political గా విడిపోతున్నాం.

అయస్కాంతపు సజాతీ ధృవాల్లాగా కలిసి ఉండటం వీలుకాక విడిపోతే బాధపడాల్సిన అవసరం లేదు. కాని కలిసి ఉండటమనే విలువ తెలియక, చేతకాక  అలా ఉండేందుకు వీలుకానటువంటి పరిస్థితి కల్పించుకొని విడిపోతున్నాం. ఈ mindset ఉన్నాక అభివృద్ధిలో అందలమెక్కితే ఎంత అధః పాతాళానికి పడిపోతే ఎంత!

ఈ సందర్భంగా ఓ మిత్రుడి ఆవేదనను పంచుకుంటూ..,

 నిన్ను రక్షించుకోలేకపోయిన దౌర్భాగ్యపు జాతి మాది. క్షమించు తెలుగు తల్లీ, క్షమించు! 


with pity for all those who are incapable of looking beyond numbers, figures of a thing called development .







--A Telanganite but not its supporter
(If identity matters)




గాంధీ

రాత్రి భయంకరంగా  అడవంతా పరచుకుంది. మిణుకుమిణుకు మంటున్న నక్ష్రత్రాల వెలుగులో ఎటువైపునుండి ఏ జంతువు మీద పడుతుందో , ఏ బందిపోటు మూక దాడి చేస్తుందో అనే భయంతో చిన్న చిన్న గుంపులుగా కదులుతున్నారు వారు. ప్రయాణం మొదలుపెట్టినప్పటి ఆశ, ధైర్యం సన్నగిల్లుతున్నట్టు కనిపిస్తుంది వారిలో. ఎటు వెళ్లాలో ఎలా వెళ్లాలో ఒక్కో గుంపు ఒక్కో రకంగా చర్చించుకుంటున్నారు తమంతా ఒక్కరుగా కదలితే ఎంత లాభమో తెలుసుకోకుండా!  అలా నడుస్తుండగా ఆ నిర్జణారణ్యంలో దూరంగా   దీపం వెలుగు కనిపించింది. వారిలో అలజడి. బందిపోట్లు ఎవరైనా కాపుకాస్తున్నారా? వేరే ఊరు ఏదైనా మొదలవబోతుందా?  ఎటుపోతే ఏ అనర్ధం వచ్చిపడుతుందోనని  ఎటూ తెముల్చుకోలేక తాము  ఉన్నచోటే ఉండిపోయారు . చివర్కి కొందరు యువకులు ధైర్యం చేసి విషయం కనుక్కునేందుకు వెళ్ళారు.



అదొక చిన్న కుటీరం, చుట్టూతా కంచె ఏర్పాటు చేయబడి ఉంది. నార వస్త్రాలు  కట్టుకున్న ఓ నడివయసు మనిషి కుటీరంలోంచి బయటకు వచ్చి ఎండు కట్టెలను పేర్చి మంటను చేస్తున్నాడు, రాత్రివేళలో కౄరమృగాలు కుటీరం వైపునకు రాకుండా ఉండడానికి. కాసేపు గమనించి, నమ్మకం కుదిరిన తరువాత ఆ యువకులు కుటీరం వద్దకు వెళ్లి ఆయనతో తమ పరిస్థితి  వివరించారు. వారికి ఆశ్రయం కల్పించడం కన్నా తనకు ఆనందదాయకం మరొకటి ఉండదని వారి బృందం మొత్తాన్ని స్వయంగా వెళ్లి కుటీరానికి తీసుకొని వచ్చాడు.  ఆ రాత్రికి పడుకునేందుకు ఆడవారికి, పిల్లలకు కుటీరం లోపల ఏర్పాట్లు చేశాడు.

మర్నాడు ఉదయం ఆ బృందంతో మాట్లాడుతూ తన పేరు శాంతనుడని, అమరావతి వాసినని భగవదనుగ్రహం పొందేందుకు సన్యాసం స్వీకరించి దేశసంచారం చేస్తూ ప్రస్తుతం ఈ అడవిలో  ఉంటున్నానని   వారి వివరాలు ఏమిటో ఈ కీకారణ్యం గుండా ఎందుకు ప్రయాణమౌతున్నారని అడిగాడు. బృందంలోని ఓ వ్యక్తి లేచి ఆయనకు నమస్కరించి తమ కథను వివరించాడు. "స్వామీ... మాది ఈ అడవికి ఆవల ఉండే స్వర్ణపురి గ్రామం. ధాన్యరాశులతో సిరిసంపదలతో అన్నపూర్ణగా భాసిల్లేది. కొంతకాలం క్రితం బందిపోటుల మా గ్రామం మీదకు దాడి చేసి మొత్తం ధ్వంసం చేశారు, దాచుకున్న సంపదను ధాన్యాగారాలను దోచుకున్నారు. మరొక చోట నివాసం ఏర్పచుకునేందుకు  వెడుతున్నాము. ఇప్పటికి పక్షం రోజులుగా ఈ అడవిగుండా వెడుతున్నాము. దారీతెన్నూ తెలియడము లేద "ని చెప్పాడు. వారి పరిస్థితి గ్రహించిన  శాంతనుడు ముందుగా ధైర్యవచనాలు చెప్పి  వారు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు మార్గాన్ని, అరణ్యంలో సాగేపుడు తీస్కొవలసిన జాగ్రత్తలను, యే యే ఫలాలను తీసుకోవచ్చో వాటిని ఎలా ఎంచుకొవాలో, బందిపోటుల నుండి తమను తాము ఎలా కాపాడుకోవాలో,  ఎటువంటి ప్రదేశంలో కొత్త గ్రామాన్నిఎలా ఏర్పాటు చేసుకొవాలో ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తి పై జీవించడం ఎంత ఉత్తమమో విపులంగా వివరించాడు. గుంపులుగా కాక అందరూ కలసి మెలసి ఉండాలని చెప్పాడు.  వారిలో కొందరిని ఎంచి నాయకులుగా తయారయేందుకు కావాల్సిన విలువలు, లక్షణాలు చెప్పి వారందరి సంరక్షణ బాధ్యతను ఎలా నిర్వహించాలో చెప్పాడు.

శాంతనుడు   క్రొత్త ఆశలు చిగురింపజేశాడు... అడవిలో కౄరమృగాల బారినపడి మరణిస్తామేమో అనుకున్న వారిలో ధైర్యం నింపాడు. శాంతనుడికి కృతజ్ఞత తెలియజేసి తమ ప్రయాణం కొనసాగించారు కొద్ది కాలానికి కొంగొత్త ’స్వర్ణపురి’ని ఏర్పాటు చేసుకున్నారు శాంతనుడు చెప్పిన మార్గంలో జీవిస్తామని నిర్ణయించుకున్నారు తమ కొత్త గ్రామంలో అతడిని దేవుడిలా కొలవసాగారు.
కాలం గడచింది, మానవ సహజమైన చపలత్వం వచ్చి చేరింది వారిలో. ఐకమత్యం కాదని ఎవరికివారు వేరని భావించడం మొదలు పెట్టారు. కొత్త మార్గాలను అన్వేషిస్తూ తమపై తాము నమ్మకాన్ని కోల్పోవడం మొదలుపెట్టారు. శాంతనుడికి తామే నిజమైన వారసులమని తమను ప్రభువులను చేస్తే స్వర్ణపురిని నిజంగానే కనక రాశులతో నింపుతామని, వేరే గ్రామలలోని సౌభాగ్యాన్ని అందిస్తామని అద్బుతాలు సృష్టిస్తామని ప్రకటించుకున్నారు కొందరు.  ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు వారికి...భవిష్యత్తుపై చీకటి మేఘాలు కమ్ముకుంటుండగా  శాంతనుడి కోసం వేడుకుంటున్నారు ’ఓ మహాత్మా... ఓ మహర్షి మళ్ళీ రా’ అని.










*********************************

ఐదారేళ్ల క్రితం గాంధీ జయంతి/వర్ధంతి/స్వాతంత్ర్య దినోత్సవం/ గణతంత్ర దినోత్సవం  సందర్భంగా  ’ఈనాడు’ సంపాదకీయంలో చదివిన వ్యాసానికి నా పైత్యం జోడించి రాసిన పోస్ట్ ఇది. అసలు ఆర్టికల్ రచయిత పేరు గుర్తులేదు.

**********************************

" తనకు కావలసిన నాయకత్వాన్ని సమాజమే తయారు చేసుకుంటుంది "
--- సహచర బ్లాగర్ శ్రీ బుద్దా మురళి గారు.


ఆ నాయకత్వం త్వరగా రావాలని కోరుకుంటూ...

భగవంతుడికి మోక్షం వుంటుందా ?

ముందుగా టపా శీర్షికకు అంతగా సంబంధంలేని ఓ విషయం మాట్లాడుకుందాం. సృష్టిరచన జరగకముందు, వివిధ మతాలనూ తత్వాలనూబట్టి, శూన్యమో దేవుడో ఉండేది (భగవంతుడికి లింగం లేదు గనక ఉండేది అంటే సమంజసమేనని అనుకుంటున్నా). దేవుడు ఆజ్ఞాపించగానే శూన్యంలోని శక్తి మార్పుచెంది ఇప్పుడు మనం చూస్తున్న సమస్త చరాచర జగత్తుగా రూపుదాల్చింది. కొంచెం లోతుగా చూస్తే శక్తి మొదట పదార్ధంగా మారి ఆపైన పరమాణువుగా, అణువుగా, మూలకంగా... ఈ క్రమానుసారంగా ప్రాణిగా రూపాంతరం చెందింది. ప్రాణికి ఉండే 'బుద్ది' కారణంగా అది ఆలోచించగలదు. భౌతిక శాస్త్ర నియమం ప్రకారం దేన్నీకూడా ఏమీలేని శూన్యం నుండి సృష్టించలేము. శక్తిని సృష్టించలేము దాన్ని కేవలం ఒక స్వరూపం నుండి మరొక స్వరూపంలోకి మాత్రమే మార్చగలం. అంటే బుద్ది కూడా శక్తి స్వరూపమే అయ్యుండాలి అయితే నిర్గుణమైన శక్తి క్రమపద్దతిలో 'బుద్ది'గా మారిన తరువాత దానికి ఏదో ఒక గుణం చేకూరడం ఆశ్చర్యకరం. ఇప్పుడు మళ్లీ బుద్ది ఉన్న ప్రాణి దగ్గరికి వద్దాం. ప్రాణుల్లో వాటివాటి పరిమాణక్రమాన్ని అనుసరించి, అంటే ప్రాణుల్లో ఉత్కృష్టమైనవి మోక్షన్ని కోరుకుంటాయట. వాటి అంతిమ లక్ష్యం మోక్షం పొందటమే. మోక్షానికి మోక్షానికి మధ్య ఆత్మ/ప్రాణి సాగించే యాత్రే జనన మరణాలు అని అంటువుంటారు. మార్పుంటూలేని, స్వఛ్చమైన, నిర్మలమైన ఆ మోక్షం ఏమై వుండవచ్చు ? సృష్టిరచన జరిగేముందు ఉన్న శక్తి కావచ్చునా ? సృష్టిరచన ఉద్దేశ్యం మరొక సృష్టి అవసరంలేని శక్తి సహిత శూన్యంలోకి వెళ్లడమా ?

ఇక టపా శీర్షిక గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసి హైందవ ధర్మంలో, బౌద్ధంలో మోక్షమనే జనన-మరణరహిత స్థితి ఉంటుంది. దేవుడి ఇఛ్చనుబట్టి, ప్రాణి పూర్వకర్మలనుబట్టి మోక్షస్థితి పొందటమా లేక మరోసారి జన్మనెత్తడమా నిర్ణయించబడుతుందట.  ఇస్లాం, క్రైస్తవంలో ఇటువంటిది లేదనుకుంటా. ఆ మతాల్లో దేవుడు ప్రాణులని సృష్టిస్తాడు సుకర్మలద్వారా ధర్మాచరణ చేసిన ప్రాణులకు ఉర్ద్వలోకాల్లో సుఖసంతోషాలను ఇస్తాడు. ఐతే ఈ అన్నీ ధర్మాలలో, మతాలలో దేవుడు నిరంతరం సృష్టిరచన చేస్తూనే ఉంటాడు. హైందవ ధర్మం తీసుకుంటే కొన్ని మహాయుగాల తరువాత ప్రళయంలో సృష్టి అంతా లయమౌతుంది ఆ తరువాత కొత్త సృష్టి మొదలౌతుంది(ట). మిగతా మతాలలో దేవుడనేవాడు ప్రాణులను సృష్టించడం నిరంతరం చేస్తూనే ఉంటాడనుకుంటున్నా. ఐతే సర్వజ్ఞుడైన దేవుడికి ప్రాణిని సృష్టించాల్సిన అవసరం ఏముంది ? తను తప్ప మరెవరూలేనపుడు ఎవరికి ఏం తెలియజేద్దామని సృష్టిని చేసాడు ? పైన చెప్పుకున్నట్టు దేవుడు నిరంతరం సృష్టిరచన చేయడానికి బద్దుడైతే అతను మోక్షప్రదాత ఎలా కాగలడు ? 
If He knows all and every thing why then there is a creation ?

If He is not free Himself, how can he free others ?

రైతు సదస్సులో JPగారి ప్రసంగం

సిటి బాబుగా వ్యవసాయం గురించి నాకు తెలిసింది నాస్తి. టీ.విల్లో, దినపత్రికలలో రైతుల సాదక-బాధకాల గురించి విన్నపుడు 'ఓహో అలాగ' అనే బాపతు.....రిజర్వాయర్ నుండి ఖరీఫ్‌/రబీ పంట కోసం నీటిని విడుదల చేయాలని ఎవరనన్నా ఆందోళన చేస్తే అప్పటికి నడుస్తున్న నెలను చూసి  అప్పటికప్పుడు ఖరీఫ్ అంటే ఇప్పుడు వస్తుంది, రబీ అంటే ఈ కాలంలో ఉంటుంది అనే లెక్కలు వేసుకుంటాను. కాబట్టి ఈ టపాలో ప్రస్తావించే విషయాలు నా అభిప్రాయాలు మాత్రమే....అవగాహన లేకూండా మాట్లాడాను అనిపిస్తే  అనిపిస్తే పెద్ద మనసు చేసుకొని సరిదిద్దగలరు.

విజయవాడలో జరిగిన రైతు సదస్సులో జే.పి గారు చేసిన ప్రసంగం ఇక్కడ పెడుతున్నాను. టివి ఛానళ్లు ఇది ప్రసారం  చేసుండరనుకుంటా....వాళ్లకు అంత ఓపిక-తీరిక ఉండవుగా



2వ భాగం



3వ భాగం




ఆ ప్రసంగం విన్నాక నాకు కలిగిన  అభిప్రాయాలు స్థూలంగా ఇవి.

౧)వ్యవసాయ ప్రధానమైన దేశంలో వ్యవసాయాన్ని బతికించుకోవడానికి పరితపించడం ఏమిటో......!! చూడబోతే తెలుగునేలలో ఉంటూ తెలుగును బ్రతికించుకొవడానికి చేస్తున్న ప్రయత్న ఉదంతంలా ఉంది. మన ఈ ప్రయత్నం చూసి ఆనందించాలో, 'బతికించుకొడానికి' చేస్తున్నాం కాబట్టి బాధపడాలో అర్ధం కావడంలేదు.

౨) వ్యవసాయ రంగం పట్ల రోజురోజుకి తగ్గుతున్న ఆసక్తి- పట్టణాల్లో పుట్టిపెరిగినవాళ్లు ఎలాగు నూటికి 99.9% వ్యవసాయం వైపు వెళ్లరు కాని గ్రామాల్లో ఉండేవారు కూడా వ్యవసాయాన్ని వదలటం ఏమిటి!? కారణాలు విశ్లేషిస్తే  నాకు తోచినవి మౌలిక వసతులలేమి, వ్యవసాయన్ని లాభదాయక రంగంగా గుర్తించక నిర్లక్ష్యం చేయడం.

౩)మౌలిక వసతులు:  వ్యవసాయానికి అనుకూలం, రైతు బంధువులం అని చెప్పుకోగానే సరిపోదుగా అది మనుగడ సాగించేందుకు తగిన వనరులను కూడా సమకూర్ఛాలి. పంటకు సరిపడా నీరు, చేతికొచ్చాక  మార్కెట్‌కు తరలించడానికి మెరుగైన రవాణా వ్యవస్థ, నిల్వ చెసుకోడానికి గిడ్డంగులు కావాలి. ఇలా తక్కిన వాటిని వొదిలేసి రుణమాఫీలతో సరిపెట్టేస్తే ఎలా. వ్యవసాయం అనేకాదు ఇవాళ చాలా పట్టణాల్లో, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచవలసిన  అవసరం ఉంది. అది రవాణా కావచ్చు, ప్రాథమిక విద్య కావచ్చు, ఆరోగ్య సంబంధితమైనది కావచ్చు , నీటి సదుపాయం కావచ్చు. కావలసింది వీటి అభివృద్ధి....ఇవి అయ్యాక వాటిపై కార్పొరేట్ రంగానికి ఊతమిచ్చి  ఆర్ధిక రంగాన్ని ఎంత దూరమైనా పరిగెత్తించవచ్చు.

౪)  రైతులే తమ పంటకు ధరను నిర్ణయించుకోవాలి--- ఈ విషయంలో నాకు కొంత విభేదం ఉంది.  ఉత్పత్తిదారుడి చేత  ధర నిర్ణయింపబడిన వస్తువులు మనరోజువారి ఆహారంలో ఉండవు కదా. నిత్యావసరాలైన బియ్యం, గోధుమలు...పప్పుదినుసుల ధరలపై నియంత్రణ లేకపోతే వాటి ధరలు ఇష్టమొచ్చినట్లు పెరిగిపోతాయి. అలా చేసేదనికన్నా రైతే నేరుగా తన పంటను మార్కెట్‌లో అమ్మేట్టు, మధ్యలో ఉండే దళారీలను కట్టడిచేస్తే బాగుంటుంది.

౫) సుమారు 70%  నూనె సంబంధిత ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకుంటున్నామట. నోరువిప్పితే Energy Sustenance ( శక్తి స్వయంసమృద్ది (?) ) గురించి మాట్లాడే అమాత్యులు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించుకోడానికి వీలున్న పామ్‌ఆయిల్, ఇథనాల్‌ను దేశియంగా ఉత్పత్తి  చేయడం గురించి ప్రణాళికలు రూపొందించరేం.....పెట్రోలియం ఆయిల్ కంపెనీలు లాభాలు ఆర్జించేందుకా. ఇంటర్మీడియట్‌లో ఉన్నపుడు చదువుకున్నా చెరకుపంటనుండి ఇథనాల్‌ను ఉత్పత్తి  చేయొచ్చనీ దాన్ని పెట్రోల్‌తో కలిపివాడితే సంప్రదాయ Fossil Fuel ( తెలుగు పదం ? ) వాడకం తగ్గించవచ్చనీ.....ఇంకా ఆ దిశగా ఏమి చేసినట్టులేదు !!




జేపి గారు తాడేపల్లిగూడెం రైతు సదస్సులో చేసిన ప్రసంగం ఇక్కడ చూడొచ్చు


వింటున్నా...

నీ సంతోషాన్ని నాతో పంచుకో
నువ్వు మురిసిపోయేందుకు పసిపాపనై కేరింతలు కొడతా.

నీ బాధను నాతో పంచుకో
అలసిన నీ మనసు సేదదీరేందుకు నా గుండెలనిస్తా.

ఒకవేళ పంచుకున్నాక నే స్పందించకుంటే
తప్పుగా భావించకు నేస్తం.
నేను నిను వింటునేవున్నా- నేను మనఃపూర్తిగా చేయగలిగినదది

***************************************************

ఆంగ్లంలో రాసిన మాతృక

Share with me your happiness
and i will rejoice like a child, gleaming,
to help you remember YOUR moment.

Share with me your grief
and you have my shoulder
to rest your troubled heart.

And one day when you express it
and i don't respond...don't take me bad, O dear,
i am listening to U-the best one i can do.

కోర్టులు, తీర్పులు, మన్నూ, మశానం

వివాదాస్పదమైన బాబ్రికేసులో అలహాబాదు హైకోర్టు తన తీర్పును ఇంకో పదిరోజుల్లో వెలువరించనుంది అనగా భారత ప్రభుత్వం తీర్పు వల్ల  అవాంఛనీయ ఘటనలు జరగొచ్చునేమోనని ఊహించి తీర్పు వెలువరించే రెండురోజుల ముందునుండి  ప్రసార మాధ్యమాలలో మసీదు పడగొట్టేప్పడి క్లిప్పింగులు పదే పదే చూపించడంగాని, తీర్పుపై ఊహాగానాలుగాని, రాబోయే తీర్పుపై  చర్చలుగానీ చేయరాదనిమార్గదర్శకాలు జారి చేసింది.సెల్‌ఫోనుల నుండి ఒక వర్గాన్ని ఎంచుకొని SMS పంపించవద్దని కొన్ని చోట్ల పోలీసు శాఖవారుకూడా  సూచించారు.  హ్మ్....జనం బాగోగులు బాగా చూసుకునే మన మీడియా రెండురోజుల ముందునుండి నిషేదించారుగాని అంతకు ముందునుండి కాదు అనే పాయింటు బాగా ఒంటబట్టించుకొని వో....... చర్చలు విశ్లేషణలూ అభిప్రాయ సేకరణ అంటూ పోల్సు వగైరా వగైరా అన్నీ కావాల్సినంత చేశారు. ఇహ ఆ చర్చలు, సేకరణలో వాళ్ల మతలబు ఏంటొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. "తీర్పు మీకు అనుకూలంగా రాకుంటే మీరు ఏం చేస్తారు?", " రాముడికి/మసీదుకు ఆ స్థలం ఇవ్వకుంటే మీవాళ్ళు ఏం చేయాలి అంటారు..", "...అంటే ఏరకమైన ఆందోళన చేయాలనుకుంటున్నారు.." ఇలా ఉంటాయి చాలా చర్చలు. దేశప్రజలకు ప్రతి విషయాన్ని తెలియపరచాలని, అంతవరకు తెలియనొడికి కూడా కొత్త కోణాలు చూపించాలని వీళ్లు చేసే ప్రయత్నం చూసి నాకు ఆనందభాష్పాలు టప టపా రాలాయి.

ఈ విశ్లేషణలు బ్లాగులకు కుడా తగులుకున్నాయి....నేను చూసిన కొన్ని బ్లాగుల్లో పోల్స్, గ్రహాలు ఉపగ్రహాలు అంటూ ఊహాగానాలు జరిగాయి. సరే....., ముఖ్యమైన అంశం కాబట్టి, వద్దన్న పని చేయడం మన నైజం కాబట్టి చేశారనుకున్నా. తీర్పు వచ్చింది, ఆషాడభూతులు అనుకున్నట్టు ఏ అవాంఛనీయ ఘటనలు, ప్రదర్శనలు, దాడులు జరగలేదు. చాలామంది మేధావులు (నిజ, కామెడి, కుహనా లాంటి అన్ని విధములవారు) అనుకున్నట్టు   తీర్పు ఏకపక్షంగా కాకుండా రాజీకుదర్చడానికన్నట్టు మధ్యేమార్గంగా స్థలాన్ని మూడుభాగాలుగా పంచింది. దీనివల్ల జనం ఏమి అనుకోలేదు...పాపం మనసోకాల్డ్ నాయకులు, మేధావులే వో ఇబ్బందడిపోయారు. "అసలు నమ్మకాల ఆధారంగా తీర్పులెలా ఇస్తారు?", "ఒకే దగ్గర మందిరం మసీదు ఎలా కడతారు?", " కడితే  గొడవలురాకుండా ఉంటాయా...!", " మామాటే నెగ్గింది...మేమన్నది నిజం అని తేలింది", " వాళ్ళు త్యాగం చేయాలి....మొత్తం మాకు ఇచ్చేయాలి" అని ఏవేవో అన్నారు అంటున్నారు. నాకర్ధం కానిది ఏంటంటే ఏ సినిమాలోనో, కధలోనో హిందూ-ముస్లిములు కలిసున్నారు అని చదివితేనో....నిన్న మొన్నటిదాకా వివాదాస్పద స్థలంలో మందిరం-మసీదు రెండూ కడదాం అని ప్రతిపాదనలొచ్చినపుడు ఇదీ మన భారతీయత అని కాలర్‌ ఎగరేసుకుంటూ చెప్పినోళ్లకు ఇప్పుడెందుకు ఇది మింగుడుపడటంలేదు, హిందూ ముస్లిం భాయి భాయి   అని మనం నిజంగా నమ్ముతున్నామా లేదా అని. ఎవరో ఎందుకు త్యాగం చేయాలి? కలిసి ఉండనివ్వాలి అని నమ్మకాల ఆధారంగా చెబితే ఏం తప్పు ఉంది అందులో? పోనీ నిజంగానే మసీదు మందిరం పక్కపక్కనే ఉంటే ఇబ్బాందనుకుంటున్నారా ? బాబులు...సమస్యాత్మక ప్రాంతం అని అనుకునే మా హైదరాబాదులో, మా ఏరియాలో నాకు తెలిసిన గత పధ్నాలుగేళ్ళుగా మసీదు మందిరం పక్కపక్కనే  ఉన్నా ఎటువంటి గొడవలు లేకుండా ఉన్నాము...ఒకసారి  అక్కడకుడా కట్టిచూడండి. తప్పక కలిసుంటారు.


సరైన న్యాయం దక్కలేదని, కొందరిని బుజ్జగించాలని చేస్తున్న ప్రయత్నమని ఇదై ఫీలైపోతున్నవారు రెండుమూడు రోజుల తేడా వ్యవధిలో వచ్చిన ఆయేషా మీరా కేసు తీర్పు గురించి మాట్లాడరెందొకో. ఓ కట్టడంమొక్క చరిత్ర ,తీర్పు భవిష్యత్తూ గట్రా నిశితంగా పరిశీలించేవారు, ఔత్సాహికులు ఆయేషామీరా లాంటి కేసులగురించి మాట్లాదరెందుకో...!!?? ఏం మాట్లాడినా మనల్ని పట్టించుకునేవాడుండనా !!


గమనిక: ఇది లోకం తీరుతెన్నులు తెలియని,  వచ్చిన తీర్పు జనాలబాగుకోరి ఇచ్చినది అని నమ్మే ఒక అజ్ఞాని ఏడుపు. మీకు ఈ ఏడుపులో నిజాయితి, న్యాయం, ధర్మం కనబడితే ఓ గుడ్డముక్క మొహానవేసి వెళ్లండి,తుడుచుకోడానికి పనికొస్తుంది, వీలైతే నాతో కలిసి ఏడవండి. ఏది కనబడక నచ్చకపోతే మీ ఇష్టం.., మీదారిన మీరుపోండి......I don't care.....

నేటి పరిస్థితి

1) పుట్టుకతో మూగ చెవిటి అయిన విశ్వేశ్వరరావు అనే అభ్యర్ధి PD కోటాలో ఉద్యోగం కోసం అర్జీ పెట్టుకుంటే లంచం అడిగిన సంబంధిత శాఖ అధికారులు. సిగ్గుండాలి ఈ నా  ______కులకి. సామన్యుడి దగ్గర చేయిచాస్తారు, అది సరిపోక వైకల్యం ఉన్నవాడు తనకాళ్లమీద తను నిలబడతానంటే అతని దగ్గరకూడా లంచం అడగటం. చూస్తే శవాలమీద చిల్లర ఏరుకునే బాపతులా అనిపిస్తుంది. పైగా ఈ  _____కులకి సంఘాలు, ధర్నాలు......థూ

ధైర్యం చేసిన విశ్వేశ్వరరావు  సదరు అవీనీతాగ్రేసరుడి పేరు బయటపెట్టడానికి  కూడా తయారయి ముఖ్యమంతిని కలిసి తన బాధ చెప్పుకుందామని రాజధాని వస్తే అప్పాయింట్‌మెంట్ ఇవ్వకుండా జాప్యం చేసిన సెక్యూరిటి.

2) విశాఖలో ఒక యువతిపై ప్రేమోన్మాది దాడి......ఈళ్లకి మామూలుగా చెప్తే వినరు. అప్పుడొసారి వరంగల్ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తే తప్పుబట్టాను....కాదు అలానే చేయాలి. అలాంటి వెధవలు బ్రతికుండి వేస్ట్, ఇంకొకళ్లనైనా వేధిస్తారు. లేపిపారేయండి వెధవల్ని......

ఏకవచన సంబోధన, కొన్ని సందేహాలు

Due thanks to Sharath ji for inspiring me to write first part of this post through his        'గారుకి' గౌరవం

1) బ్లాగు మొదలుపెట్టాక ఊరకే ఉంటామా? ఉండము కదా, తోచింది రాస్తాము . మరి ఆ రాసిందాన్ని దాని మానాన ఉండనిస్తారా..లేదు దారినపోయేవారు చూసి చదివి వ్యాఖ్యానించి వెళ్తారు. అద్గో అక్కడే వచ్చింది సమస్య. నేనేమో ఈ విశాల జీవితంలో క్వార్టర్‌ సెంచరికి కుంచెం  దగ్గరలో ఉన్న పిల్ల మేధావి-వెధవని. మరి ఈ వ్యాఖ్యానించేవాళ్ళు 'గారు' అనేసి మాట్లాడేస్తుంటే మా సెడ్డ ఇబ్బందిగా ఉండేది. బ్లాగు మొదలెట్టిన కొత్తలో అయితె ఈ ఇబ్బంది చెప్పనలవికాదు. అప్పటికి మాలాంటి యంగ్‌ అండ్ డైనమిక్ అండ్ చార్మింగ్ యువతరం సంఖ్య తక్కువ. ఒకరికి ఒకరం ఎరుక లేదాయే, సో పోస్టులకు కామెంటేవాళ్లలో చాలామంది నాకన్నా పెద్దవారు. వాళ్ళుకూడా గారు అని సంబోధిస్తుంటే, ఎప్పుడు అలవాటులెని పిలుపు కదా, అదోలా ఉండేది. మనకేమో సీరియస్‌లో సరదాగా, సరదాలో సీరియస్‌గా ఉండటం అలవాటు..వాళ్ళు అలా మాట్లాడేస్తుంటే వీలు పడదాయే. అలా లాక్కొలేక పీక్కొలేక గడిపేసాను. కొన్ని నెలలయ్యాక నేను కొందరి బ్లాగుల్లో 'బాసు', 'గురు',' బెదరు', 'భాయ్' లాంటివి వాడటం మొదలుపెట్టాను. దానివల్ల వారుకూడా తిరిగి కామెంటేపుడు కాస్త చొరవ తీసుకొని పలకరించేవరు, నేను కొంచెం అనవసరపు సీరెయెస్‌నెస్ మేంటైన్‌ చేయల్సిన తప్పేది.

ఇక ఈ మధ్యన తెలుగు బ్లాగ్లోకంలో కుర్రకారు సంఖ్య కొంచెం ఎక్కువైంది కాబట్టి శరత్‌ భాయ్ బ్లాగులో జ్యోతి గారన్నట్టు అభిమానం మనసులో ఉండాలి ఇలా ఈకలు, తోకలలో ఉండాల్సిన అవసరం లేదన్నారు కాబట్టి  ఒక అలోచన చేస్తున్నాను. నా  యేజ్‌ గ్రూపు బ్లాగర్లను 'గారు', 'అండి' లతో పిలవను. అంటే మరీ సంబోధ ప్రథమా విభక్తి ఉపయోగించి ఓయి, ఓరా, ఓసి అనకుండా బ్లాగరు పేరుతో పిలవాలనుకుంటున్నా. మిగతా పెద్ద బ్లాగర్లను ముడ్‌ని బట్టి గారు, బాసు...లాంటివి జోడించి పిలుద్దామని. పెద్దబ్లాగర్లు, కుర్రబ్లాగర్లు నా బ్లాగులో వ్యాఖ్యానించేపుడు, నేను పెట్టిన వ్యాఖ్యలకు స్పందించేపడు కూడా తోకలు ఈకలు పెట్టవద్దని మనవి. నామటుకు నన్ను అరెయ్, ఒరెయ్ etc etc పెట్టి పిలవనంతవరుకు ఎలా పిలచినా ఓకే. But i'd prefer non-formal addressing. దీనికి ఎంతమంది ఒప్పుకుంటారో తెలియదుగాని ఇప్పటికైతే కొందరు మా కుర్రతరం బ్లాగర్లు హరే కృష్ణ, కత పవన్, సాయి ప్రవీణ్, వెంకట కృష్ణ, రామ కృష్ణ.....లాంటి వాళ్లను, కొందరు మహిళా బ్లాగర్లను పెరు పెట్టేసి పలకరించాలనుకుంటున్నా. కాబట్టి బ్లాగు సుజనులారా మీకు నా అవిడియా  బాగుందనిపిస్తే, అఫ్‌కోర్స్ బాలేదనిపించినా, చెప్పండి. And మిగతా కుర్ర బ్లాగర్లు ఎవరైనా ఉంటే ( ఆల్రేడి లిస్టులో ఉన్నవాళ్లతో సహా ),  నేను మీ బ్లాగులో ఎప్పుడైనా వ్యాఖ్యానించి ఉంటే, మీకు నా ఆలొచన నచ్చినట్లైతే మీ అమోదం, అయిష్టం తెలుపగలరు.


2) చాలా రోజులనుండి అనుకుంటున్నా...ఎవరిని అడుగుదామా అని. ఎవరిని ఏ బ్లాగులో అడగాలో తెలియక సైలెంట్‌గా ఉండిపోయా. ఈమధ్యన మా స్నేహితుడిని ఒకణ్ని అడిగితే వాడికీ తెలియదన్నాడు. ఆత్రం అపుకోలేక అడిగేస్తున్నా...రాయల వారి పద్యం ‘తెలుగదేల యన్న దేశంబు తెలుగేను...’ కు ప్రతిపదార్థం ఎవరికైనా తెలుసా. బ్లాగర్లు  ఎంతోకొంతమందికి తెలిసే ఉంటుంది. దయచేసి నాకు చెప్పండి.

ఇంకొకటి, మనం ఎదైనా పనిని క్రమం తప్పకుండా చేయాలి అని చెప్పడానికి తరచుగా 'తూ.చ' తప్పకుండా అని వాడుతుంటాం. ఇదీ ఒక పదమే అని అనుకొందామంటే దాని మధ్యలో ఒక చుక్క ఉంది. అంటే ఒక పెద్ద పదానికి ఇది abbreviation అయి ఉండవచ్చు. ఆ పెద్ద పదం ఏంటని స్కూల్లో ఉన్నపుడు మా తెలుగు  మాష్టారుని అడిగాను. ఆయన నాకు తెలియదని జవాబిచ్చాడు. అప్పటినుండి ఇది తిరని సందేహంగా మిగిలిపోయింది. దానర్థం ఎంటో తెలిస్తే చెప్పండి.



ఇట్లు,
నాగార్జున aka  చారి

చేదుపాట

నిన్న రాత్రి తెలిసిన బ్లాగులు కొన్ని తరచి చూస్తూ కృష్ణప్రియ గారు  సమీర్ పైన రాసిన పోస్టునొకటి చూడడం జరిగింది. నిజానికి ఆ పోస్టు ఎప్పుడొ నా ఫీడ్ బర్నర్ లో వచ్చింది కాని టైటిల్‌లో ‘కథ’ అనివుండే సరికి నిజంగా కథ అయివుండవొచ్చని ఇన్ని రోజులు చదవలేదు. కాని నిన్న ఆ పోస్టును చదివిన దగ్గరినుండి నాలో ఎదో దుఃఖం లాంటిది ఏర్పడింది. ఆ సమీర్ ఎవరో నాకు తెలియదు. కాని ఇప్పుడు అతను గనక ఎదురైతే అతన్ని హత్తుకొని ‘Every thing is all right bro' అని అనాలనిపిస్తుంది. అతణ్ణి గురించి కృష్ణప్రియ గారు చెప్పిన ఓ పేరాను ఇక్కడ చూడండి
ఒకసారి ఒకబ్బాయి.. ముజఫ్ఫరాబాద్ బీహార్ లో ఉందనుకున్నాడు. ఇతను ఉగ్ర రూపం దాల్చి.. 'అదేంటి ? ఆ మాత్రం తెలియదా? పీ ఓ కే లో ఉంది. అక్కడ జనాలు అంతమంది చస్తుంటే.. మీకు కనీసం ఎక్కడుందో ఐడియా కూడా లేదా ? అని హుంకరించాడు. నేను కలగచేసుకుని.. 'అతనికి తెలియదు.. ఓ కే.. నువ్వు చెప్పు కర్ణాటక సీ ఎం ఎవరో చెప్పు మొదలు..' అంటే చెప్పలేకపోయాడు. మూడేళ్ళపాటు ఉంటున్నావు బెంగళూర్లో. నీకామాత్రం తెలియదు. ..? ' అంటే.. నవ్వేసి.. 'యూ గాట్ మీ ఆన్ దట్ ' అని వెళ్ళిపోయాడు.
 అతని స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే ఆ కోపాన్ని అలాగే కొనసాగించే వారు. అతనో కాశ్మీరి పండిట్ కుటుంబానికి చెందినవాడు. పండిట్ల పట్ల కాశ్మీర్‌లో జరుగుతున్న అకృత్యాలను తెలిసినవాడు. అతను పై సందర్బంలో కోప్పడడంలో తప్పులేదనిపించింది....అయినా చివరకు తేలికయ్యాడు. మనలో ఎంతమంది అలా చేయగలం ?
పోస్టు మొత్తం చదివాక గుండె బరువెక్కిపోయింది. అతను ఎక్కడ ఉన్నా క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్నా...ఆ ఫీలింగ్‌ నుండి బయట పడడానికి పాటలు వినడం, వేరె బ్లాగులు ఓపెన్ చేయడం, నా బ్లాగుకి వచ్చిన వ్యాఖ్యలు చూడడం మొదలుపెట్టా...ఉహూ అస్సలు వీలవలేదు. ఎదో తెలియని బాధ.  అదే సమయంలో అంతకు ముందురోజు చూసిన వజ్రాల తవ్వకాలలో నలిగిపోతున్న ఆఫ్ర్రీకా ప్రజలమీద తీసిన బ్లడ్ డైమండ్ సినిమా, నా తెలంగాణాలోంచి మిగతావారిని తరిమేయాలని కేసిఆర్ చేస్తున్న చర్యలు, అప్పుడేపుడొ చేతన్ భగత్ three mistakes of my life  పుస్తకంలో ఒక కాశ్మిరీ పండిట్ పాత్ర గుర్తుకొచ్చాయి. అప్పటిదాకా మనస్సులో ఉన్న బాధ ఎక్కువై కళ్లలో నీళ్లు తిరిగాయి.

అసలు మన దేశంలో ఉన్నవారి గురించి మనకేం తెలుసు. కాశ్మీర్‌లో ప్రజలు పడే బాధలు, ఈశాన్య భారతంలో సైనికుల అకృత్యాలు, విప్లవం పేరుతొ మావోయిస్టులు శాంతి పేరుతో పోలీసులు-ప్రభుత్వాలు చేస్తున్న దురాగతాలు , తిండిలేక నిర్లక్ష్యపు వరదలో కొట్టుకుపోతున్న జనం మనకేం తెలుసు (నేనేమి మినహాయింపు కాదు). బండేసుకు తిరగడానికి తక్కువ ధరలో పెట్రోలు, మాట్లాడటానికి చేతిలో సెల్లు, వీకెండ్స్ ఆనందంగా గడపడానికి పార్కులు పబ్బులు ఉన్నాయని సంబరపడుతున్నాం. రెండంకెల జీడిపి ని తలుచుకొని మురిసిపోతున్నాం. నాణేనికి మరోవైపు ఇంత చీకటి ఉన్నాకూడా. అన్నీ బాగుండాలి, నాకో idealistic ప్రపంచం కావాలని కాదు, కాని ఇన్నేళ్లుగా సమస్య అలాగే ఉన్నా స్తబ్థత ఎందుకు మనలో, ఎందుకు ఈ నిర్లక్ష్యం ?

సమీర్ గురించి చదివాక శ్రీశ్రీ గారి కవితలు కొన్ని గుర్తోచ్చాయి...
ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం..నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం...
లేదు సుఖం, లేదు సుఖం
లేదు సుఖం జగత్తులో
బ్రతుకు వృధా, చదువు వృధా
కవిత వృధా!,వృధా,వృధా!
మనమంతా బానిసలం
గానుగులం, పీనుగులం
ఆలోచన, ఇంగితం ఉన్న మనుషులుగా పుట్టాక తినడానికి ముప్పూటలా తిండి, చుట్టూ అభిమానించే జనం,చేయడానికి శ్రమ సంపాదించుకోలేమా...? ఎందుకీ ద్వేషాలు, పౌరుషాలు, మోసాలు...

I realize that the world is more sinner and cynic than i thought it to be and I do believe that it has much more love and humanity to rescue this place from the tyranny and brutality of human oppression . But will we ever let it show up ?

ఇంత బేవార్స్‌గాల్లేంట్రా బాబు

అసలే రాష్ట్రం తుఫానుతో అల్లాడిపోతుంది. అందులో నష్టపోయినవాళ్లకు ఉన్న బాధలు చాలవన్నట్లు ‘ఎలావుంది’ అంటూ ఫినాయిల్ తాగే ఫేసులేసుకొనొచ్చే నాయకులు. ఆల్లేమైయినా ఆరుస్తారా తీరుస్తారాంటే అదీలేదు, మెయిన్‌ ఎడిషన్ ఫ్రంట్‌పేజి ఫొటొకోసం నోటికేదొస్తే అది వాగిపారేయడం.
వరదతాకిడి గురైన నెల్లూరు జిల్లాలో పర్యటించిన మన ‘డైనమిక్‌’ మాజి CM బాబు తన పర్యటనలో ఈ స్టేట్‌మెంట్ ఇచ్చాడంటా
"రోశయ్య ఆకాశంలో తిరుగుతూ తుఫాను నష్టాన్ని తెలుసుకుంటుంన్నారు...ఆకాశంలో తిరిగితే ఉలవపాడులో మామిడి నష్టం తెలుస్తుందా..? బొడ్డువానిపాలేలో పొగాకు నష్టం తెలుస్తుంద..? కళ్లాల్లో తడిసిన వరి సంగతి తెలుస్తుందా..? బొప్పాయి రైతుల కష్టాలు తెలుస్తాయా..? పత్తి రైతుల ఇక్కట్లు తెలుస్తాయా..?"
 అసలు ఈయనగారు బుద్దుండే ఈ మాట మాట్లాడాడా అని కాసేపు బుర్రగోక్కున్నా. CM హెలికాప్ట్రర్‌లో కాకపోతే ఎడ్లబండిలో వస్తాడు, అయితే ఏంటట వరద నష్టం అంచనా వేయడం, నష్టపోయినవాళ్లకు స్వాంతన చేకూర్చడం ముఖ్యంగాని!
బాబుగారి మాట విన్నాక అదేదో సినిమాలో సన్నివేశం గొర్తొచ్చింది. అక్కడకూడా సేమ్ scene వరదలొస్తే ముఖ్యమంత్రో ఇంకొకల్ళో చూడ్డానికి వెల్తాడు. ఇందులోకూడా ప్రభుత్వాన్ని ఇరుకునపెడదామని ప్రతిపక్షనేత తన అసిస్టేంట్లతో ఇలా అంటాడు " ఒరేయి రేపు గనక వాడు రైలులో పరామర్శిండానికి వస్తే మన పేపర్లో ‘జనాలు అల్లాడిపోతుంటే తాపిగా రైలులో వచ్చిన CM’ అని హెడ్‌లైను పెట్టేయి. అదికాక హెలికాప్ట్ర్‌ర్లో వస్తే ‘జనం నేలమీద బాధలు పడుతుంటే గాల్లో తిరుగుతూ వచ్చిన CM' అని రాసెయ్." అచ్చం అలాగే, తొమ్మిదేళ్లు CMగిరి వెలగబేట్టి ఇప్పుడు ఫక్తూ లోకల్ చిల్లర పొలిటీషియన్‌లాగా ఆ అర్థం పర్థంలేని వ్యాఖ్యలేంటొ ఈయనకు. పొయినసారి అసెంబ్లీలో ‘కావాలనే అబద్దం చెప్పా’మన్నందుకు వచ్చిన చీవాట్లు చాలవేమో. ఈయనగారు బాధ్యతాయుతమైన ప్రతిపక్షపార్టినేత. ఏం ఖర్మరా దేవుడా!! అన్నేళ్ళు CMగా వుండి, అంతకన్నా ఎక్కువకాలం రాజకీయాళ్లో కీలకపదవుల్లోవుండి ఈయన సంపాదించిన ‘విజ్ఞత’ ఏమైనట్టు?
ఈయనగారికి తోడు తానాతందానా బామ్మర్ది, ‘చరిత్ర సృష్టించాలన్నా మేమే, ఆ చరిత్ర తిరగరాయాలన్నామేమే’ అంటూ చరిత్ర సృష్టించిన పార్టికి ‘అవకాశం ఇస్తే’ సారథినౌతా అని డైలాగులు. తాతలు నేతులు తాగితే ఈళ్ల మూతుల వాసన ఎవడిక్కాలంట!


మన మెగానటుడిగారి రూటే సపరేటు. ఎంతసెపు ఆ సామాజిక న్యాయం, సామాన్య శాస్త్రం, నేనేం చేయాలో ప్రజలే చెప్తారు అని చెప్పుకుపోవడం తప్పిస్తే ఇంతవరకు ఒక్క అంశంమీద మా పంథా ఇదిఅని చెప్పిందిలేదు. అసెంబ్లీలో చేసిన performance చాలనట్టు రాజ్యసభక్కూడా వెళ్తార్ట. అవకాశం వినియోగించుకోవడంలో తప్పులేదుగా..నాక్కూడా అవకాశం వస్తే ఈయనకోటి చెప్పాలనుంది, ‘అయ్యా మీరంటే ఒకనటుడిగా మాకు ఇంకా చాలా గౌరవముంది.రాజకీయాల్లోకొచ్చి తలాతోకలేని నిర్ణయాలతో,మాటలతో దాన్ని పోగొట్టుకోకండి. టైం తీసుకున్నా ఫరవాలేదు  మీరు చేద్దామనుకుంటున్న ప్రజారాజకీయలపైన అవగాహన వచ్చాకే రండి’ అని. ఎన్నటికి కుదిరేనో.

అధికారపక్షం  చిన్నబాబుది ఇంకో స్టయిలు. ధరలుపెరిగి, పనుల్లెక పంటల్లెక తిండిలేక జనమేడుస్తుంటే అయ్యపోయిన సుమారు ఏడెనిమిది నెలల తరువాత ఓదార్పు యాత్రంట. నవ్వుకోడానిక్కాకపోతే ఇప్పుడు  ఆ పోయినాయనని తల్చుకొని ఎవడు బాధపదుతున్నాడొ?, వాళ్ల జీవితం మీది వాళ్లె బాధపడేవారు తప్పిస్తే. పైపెచ్చు ఆ బాధపడే వర్గమేదో ఆయన చనిపొయినప్పుడే రికార్డు లెవెల్లో పోయారుకదా. చూస్తూంటే శవంమీద చిల్లర ఏరుకునేట్లు కనిపిస్తుంది యవ్వారమంతా. బాబుగారు ‘ఫ్యూచర్ ముఖ్యమంత్రి’. హ్మ్ విధి వైపరిత్యంకాకపోతే ఏంటి ఇది!!  ఇంతచేసినా బాబుగారి బాజా భజంత్రీలకు కొదవేలేదు
" జనం జగన్‌తో ఉన్నారండి, వాళ్ల మనసులో జగనేఉన్నాడు.."
"రెడ్దిగారిలో ఎవైతే లక్షణాలుండేవొ అవన్ని జగన్‍లోకనపడ్డాయి నాకు"
"జగన్ జనం గుండేల్లో వున్నాడండి.."

ఛీ... ఇంత దరిద్రమేంట్రా బాబు అనిపిస్తుంది తలచుకుంటే.
భగవంతుడా....ప్లీజ్ సేవ్ మై పీపుల్‌



మీరేమంటారు+ హుస్సేనియత్

నా గత పొస్టు మీరెమంటారు పబ్లిష్ చేసిన తరువాత ప్రయాణంలొవుండడంతో స్పందించడం కుదరలేదు. వచ్చిన వ్యాఖ్యలని చూస్తే నేను చెప్పదలచిన విషయాలని సరిగా అర్థమయేలా  చెప్పలేదేమోనిపించింది (సరిగ్గా అనే సంగతి పక్కనపెడితే అసలు అర్థమైందా అనేది ఇంకో విషయం). బహుశా అక్కడ చెప్పిన ఉదాహరణలు out of context లా అనిపించేలా చెప్పాననుకుంటా.

ఆ subject పైన నాకున్న కొన్ని ప్రశ్నలను ఇంకొంచెం clarity ఇచ్చి అడగాలని ఈ టాపా రాస్తున్నాను.
To begin with, నా పాత పోస్టులో మొదటి instance, young couples moving intimately around temple premises. నా వుద్దేశంలో వాళ్ళకు కలిసితిరిగే స్వేచ్చ ఉంది, సాన్నిహిత్యాన్ని అనుభవించొచ్చు అందులో ఎటువంటి సందేహంలేదు. అయితే అంతటి సాన్నిహిత్యాన్ని,  more precisely intimacyని కోరుకునేవాళ్లు భక్తితో మెలగాల్సిన ఆలయ పరిసరాల్ని ఎంచుకొవడందేనికి? ఏదొ ఒకటొ రెండొ సందర్భాలో emotional heightsకి చేరి అలా జరిగితే పట్టించుకోనవసరంలేదు. కాని వీడియోలొ చూపించినదాన్ని బట్టి చూస్తే అలా అనిపించదు. They seem to have take it granted to explore that place for disclosing their intimacy. అది వాళ్లకిచ్చిన స్వేచ్చని misuse చేసినట్టుకాదా? అయితే ఇదే ప్రశ్న పాతపోస్టులో సరిగా పెట్టలేదనుకుంటా, కేవలం ఆడవాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని టార్గెట్‌ చేసి రాసానని వ్యాఖ్యవచ్చింది.

ఇక రెండవ ఉదాహరణ విజయ్‍ గారి పొస్టు పైన. స్వాతంత్ర్యం వుందికదాని, నేను (మగాడు) సంకనాకిపోయానని ఆడవాళ్లు అదేచేస్తే అది సరైందే అని  ఎలాఅనుకోవాలి? దాన్ని ఎలా సమర్దించగలం?(తప్పు అని అనడంలేదు, సరైంది కాదంటున్నా, గమనించగలరు). అలాగే మగాళ్లు మాత్రమే తాగాలిఅని అనడంలేదు. నేను దానికీ వ్యతిరేకమే. శీతల వాతావరణం ఉండే అప్రాచ్యపు దేశాల్లొ( ప్రాచ్యం= తూర్పు, అప్రాచ్యం= తూర్పుకాని) ఉండేవాళ్లకు అవసరంకాని మనకేందుకు social elitenes చూపించుకోడానికో డబ్బులు తగలేయడానికి కాకపోతే. అభ్యంతరం లేదనుకుంటే రేపు స్కూల్లల్లో ఉపాద్యాయులకు విద్యార్థులకు ఇదే freedom of expression వల్ల బేధాలొస్తే అంగీకారమేనా?

ఇంకో ఉదాహరణగా MF Hussain గారిగురించి మాట్లాడుకుందాం. ఎటువంటి సందేహం లేకుండా , ఇప్పుడున్న వివాదాస్పద పెయింటింగ్స్ పక్కన పెడితే, ఆయన గొప్ప కళాకారుడు. ‘పద్మశ్రీ’, ‘పద్మవిభూషణ్’ బిరుదాంకితుడు రాజ్యసభలో ఎంపీగా కూడా చేసినవాడు. ఎంతమంది సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ల తరఫున ఆయన్ను గౌరవించుంటారో అర్థం చేసుకోవడనికి పెద్ద మేధావి అవ్వాల్సిన అవసరంలేదు. మరి అంత గొప్ప కళాకారుడు ‘నువ్వు వేసే ఈ రకం బొమ్మలు మాకు బాధ కలిగించేలవున్నాయి బాబు’అని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అలాంటివే వేయడం ఎంత సమర్దనీయం? ఆయన్ని సమర్దించడం ఎంత సరైంది?
ఇక్కడ సందర్బం వచ్చింది కాబట్టి ఆయన్ని వెనకేసుకొచ్చేవాళ్లను అడుగుతున్నా, ఆర్ట్ లో ప్రతి రంగుకీ, భంగిమకి, expressionకి ఓ అర్థముంటుందిగా (అనే అనుకుంటున్నా) మరి హుస్సేన్ గారి సీతాపహరణం పెయింటింగ్‌లో  రావణుడూ,హనుమంతుడు,సీతను ముగ్గురినీ అచ్చాదనలేకుండా చూపించడంలో ఆయన ఏం చెప్పదలచుకున్నాడు. మీకు ఓ వేళ తెలిస్తే పెద్ద పెద్ద పదప్రయోగాలు చేయకుండా సరళంగా చెప్పండి. అలాగే skewed హిందుభావజాలమంటూ మొదలెట్టకండి- I am no religious man.

రాజ్యాంగం మనకు భావప్రకటన స్వేచ్చను ఇచ్చింది. దానర్థం నీకు తొచినట్టు నువ్వువాగు, పనులు చేసుకో అనా లేక నీకు   ఒక పని/భావం సరైంది అని అనిపించినప్పుడు దాన్ని ఎవరైనా అణిచివేస్తారేమో అన్న భయం లేకుండా వ్యక్తపరిచేందుకు హక్కువుందనా?
పాతపోస్టులో మైత్రెయిగారు వ్యాఖ్యానిస్తూ విలువలు బలవంతాన రుద్దితే రావన్నారు. నిజమే. అయితే freedom of expressionని అనుసరిస్తున్నపుడు ఏదొ దశలొ హద్దుదాటామెమో అని అనిపిస్తుంది. ఈ హద్దు ఎవరు నిర్ణయిస్తారు-వ్యక్తి వ్యక్తికి వేరు వేరు హద్దులు వుండాలా లేక అందరికి ఒకేలా సమాజం నిర్ణయిస్తుందా.

మీరెమంటారు

కీసరగుట్ట దేవాలయ పరిసరాల్లో జరుగుతున్న సంఘటనలపై NTv కధనం చూడండి



సారాంశం మీకు అర్థమయ్యేవుంటుంది, గుడి పరిసరాలను యంగ్ కపుల్స్- మీడియా భాషలో ‘ఒళ్ళు బలుపు’వున్నవాళ్ళు పార్కుల్లాగా వాడేసుకుంటున్నారని  అంటుంది. ఈ వీడియో చూసిన చాలామందికి  కూడా అలానే అనిపించుండొచ్చు-ఒళ్ళు బలుపు అని.
ఇక ఈ టాపా రాయడానికి ముఖ్యకారణం కట్టా విజయ్ గారి బ్లాగులోని ఈ టాపా, దానికి వచ్చిన వ్యాఖ్యలు. అక్కడ వచ్చిన కొన్ని వ్యాఖ్యల ఉద్దేశ్యం ఏంటంటే ప్రపంచం నాగరికమౌతుంది, మగాడు తాగగాలేంది ఈ రొజుల్లొ అమ్మాయిలు తాగితే తప్పేంటి అని. ఒకవేళ తాగినా అది వారి వ్యక్తిగతమైన విషయం, దాన్ని గురించి చర్చిండం ఎందుకని.

ఇక్కడ నేను మాట్లాడదలచింది ఆడవాళ్ల హక్కుల గురించి కాదు, వీడియోలో చూపించింది తప్పోవొప్పో చెప్పడానికి అంతకన్నాకాదు.  మాట్లాడలనుకుంటుంది ఈ రెండు సంఘటనల వెనకవున్న అసలు attitude గురించి- ఆధునిక నాగరికపు సమాజపు పోకడగా చెప్పబడుతున్న స్వేచ్చ గురించి. ఒక్కసారి ఆలోచించండి, ఆ వార్తాకథనం కనుక గుడి దగ్గర జరుగుతున్న రొమాన్స్ ని కాకుండా ఏ పబ్లిక్‌ పార్కులోనో, సాగర్ చుట్టుపక్కలో  జరుతున్నవీర రొమాన్స్ చూపిస్తే మనకు కలిగే అభిప్రాయంలో ఏమైనా మార్పుండేదా? నేననుకోవడం కొద్దోగొప్పో అదే భావనవుంటుంది.  ఇప్పుడు  కట్టాగారి టాపాగురించి మాట్లాడుకుందాం, ఓవేళ అక్కడవున్నది నిజంగానే ఆల్కహాలైనా,  రూంలోకాకుండా బార్లోనే తీసుకుంటున్నారని చూపించేట్టుగావున్నా వ్యాఖ్యల్లో తేడావుండేదికాదు. అందులో తప్పేంటి అని అనేవారే.

అయితే ఈ రెండు విషయాల్లోనూవున్న కామన్‌పాయింట్ ఒక్కటే. they were exercising their choice granted by their liberty. మరి రెండొ సంఘటనలో తప్పనిపించని స్వేచ్చ, మొదటి సంఘటనలొ తప్పుగా ఎందుకు తోస్తుంది. రెండిట్లోనూ సరదాకోసమో మనస్ఫూర్తిగానో ఇతరులకు నష్టంకలక్కుండా వాళ్ళు చేయలనుకున్నది చేసారు. మరి ఒకటి తప్పు మరొకటి తప్పుకాదన్నట్టు ఎందుకనిపిస్తుంది.

కాకతాళియంగా ఇవాళ ఫ్రెండ్స్ తో MMS scandals,  సినిమాల గురించి మాట్లాడుతుంటే మాటల్లో స్వేచ్చ ప్రస్తావనొచ్చింది. మావాడొకడిలా అన్నాడు " ఇలాగే స్వేచ్చ అనుకుంటూ కంటిన్యూ అయితే ఇంకో 10-15 ఏళ్లలో మన సొసైటిలో ఆడవాళ్లపై ఉన్న గౌరవం పోతుంది"అని. వాడు చెప్పాలనుకున్నది మగాడికివున్న స్వేచ్చ ఆడవాళ్లకు ఉండకూడదని కాదు, స్వేచ్చ అంటూ అనుసరితున్న పోకడల పట్ల విమర్శ మాత్రమే.



గమనిక: కట్టాగారి టాపాలోని విషయాన్ని ఉదాహరణ కోసం ప్రస్తావించాను. అంతేగాని అది తప్పా సరైందా చెప్పడానికికాదు. కాబట్టి ఫెమినిజం అంటూ ఆడ స్త్రీ  లేడిస్‌ను కించపరిచానని అన్యధా భావించవద్దు. అది నా అభిప్రాయంకాదు.

మై తెలుగువాలా హై-2

ఎవరివాదన ఎలావున్నా విషయంతేలీని ‘కుహనా’గాళ్ల గొడవ రోతగావుంది. తెలుగు, ఆంధ్రము వేరు  కాబట్టి తెలంగాణా, ఆంధ్ర వేర్వేరు రాష్ట్రాలవడంలో తప్పులేదనే మహానుభావులనుండి మేమొ మీకు తినడం నేర్పించాం ఇప్పుడు తెలంగాణానుండి వెళ్ళిపోమంటే మీరు బాగుపడనే పురాణపురుషులున్నారు. లెక్కలు పత్రాలంటూ వాదించే వారికి కొదవేలేదు. చూడండి మా బతుకులు అత్యంత దరిద్రంగావున్నాయనొకరు, అబ్బే అలాంటిదేంలేదు ఇక్కడ చూడు..... మనం నిండువెన్నల చంద్రుడిలా వెలిగిపోతున్నాం మాకన్నా మీరు మహబాగా వెలిగిపోతున్నారనొకరు. తెలుగునేలలో ఎవరుకూడా ‘ప్రాంతీయత’ కారణంగా దుర్భ్హరంగాకాని సంపన్నంగాకాని బ్రతకడంలేదు. ఇక్కడవున్నవి అసమానతలు, వాటిని పెంచిపోషిస్తున్నది పదవులకోసం,ముడుపులకోసంమాత్రమే బతుకీడుస్తున్న నాయకగణం, ఎంత దగాపడినా మళ్ళి ‘అన్యథా శరణఁనాస్తి త్వమేవశరణం మమః’ అంటూ అదే నాయకుల ఉచ్చులో పడుతున్న సామాన్య ప్రజలు.

మనలో మనకు ఐక్యతలేకపోవడమే ఈ పరిస్థితికి మూలమా అని ప్రశ్నించుకుంటే బుర్రలో ఏదోమూల అవుననె సమాధానం వినపడుతుంది నాకు. కారణం ‘భాష, దాని అనుబంధాలైన social lifestyle’ అంటుంది. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో మొదటి రాష్ట్రం అయివుండి, పక్కనవున్న రాష్టాన్ని అదే కారణంచేత విలీనం చేయించుకొన్న ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలను ఒకే ‘తెలుగు’ గొడుగుకిందకు తేలేకపోయాం. పూర్తిగా ఒకరికొకరు ఉత్తర-దక్షిణ ధృవాల్లాగా వున్నారనికాదు కాని ఇన్నేళ్లుగా time తీసుకువచ్చిన సఖ్యత తప్ప ( ఓ గదిలో ఎక్కడేక్కడినుండో తెచ్చిన కోతుల్ని తెచ్చిపెడితే ముందు నానా పెంట చేస్తాయి...సమయం గడుస్తున్నకొద్ది వాటిల్లొ ఓ harmony వస్తుంది, కొట్టుకోకుండా వుంటాయి. వాటిల్లొ ఏఒక్కదానికి ‘కోతిబుద్ది’ పుట్టినా మళ్ళి అల్లరి మొదలు..అలావుంది పరిస్థితి) నిజంగా కలుపుగోలులేదు. మనల్ని ఐక్యంచేసిన భాషకి తిలోదకాలిచ్చాం. ఇప్పుడు తెలుగు టెలుగైపోయింది పొరుగు రాష్ట్రపు సోదరుడికి తన భాషమీదున్న అభిమానం మనకు కరువైంది. పోని సాంస్కృతికంగానైనా దగ్గరిచేసే ప్రయత్నాల్లేవ్‌. ప్రాంతీయ uniqueness పేరుతో తెలుగువాళ్లం ఒక్కరంకాలేదు. తెలంగాణోడికి ఇక్కడ రజకార్ల పోరాటం, నిజాం తెలుసు ఆంధ్ర-సీమ జిల్లాల యాస వేరని తెలుసు, అవతల పక్కా అంతే. కాని వేరుగావున్నప్పుడు మనం ఎలా జీవిచాం, అసలు తెలుగువాళ్ల మధ్య ఈ అంతరం ఎందుకు వచ్చింది, ఒకళ్ళుగా వున్నవాళ్లు ఎలా వేరుపడ్డాం ఎలా ఒక్కరయ్యాం ఎంతమందికి ఎఱక.తెలిసిందంతా 1956లోఆంధ్రా ఆంధ్రప్రదేశ్‌ అవడంచేత ఒక రాష్ట్రంలోవుంటున్నాం.  భేదం అంతరించేందుక్కాకుండా దాన్ని చూసి పౌరుషాలగడ్డనో,సాహితిపుణ్యభూమనో  ఎవరికి వాళ్లు మీసాలు మెలేసుకున్నారు. యాసని-ప్రాంతీయ జీవనానికి ఓ రంగేసి ఈ ప్రాంతం అంటే ఇలాంటి మనుషులు మాత్రమే అని అర్థమిచ్చేలా అలుపెరుగని కృషిచేస్తున్న సినిమారంగాన్ని గూరించి చెప్పనక్కరలేదు ( ఈ మాట అనడానిక్కారణం భారతదేశంలో హింది తరువాత తెలుగు సినిమా మార్కేటే ఎక్కువ. సినిమా చూసి హీరోయిజం/త్యాగాలు/సేవలు చేసేవాళ్లుండకపోవచ్చు కాని దాన్ని బుర్రలో పెట్టుకొనే వాళ్లు చాలానే)



అభివృద్దిని పంచకుండా అంతా ఓ దగ్గర కుప్పపోసాం. విలీనమైనప్పుడు ఈ రెండు రాష్ట్రాల భౌగోలిక స్థితిగతులు వేరు, వనరుల వినియోగతీరు వేరు,  వీటిని సమన్వయపరచడానికి తయారుచేసుకున్న ఒప్పందాలు తుంగలోతొక్కబడ్డాయి. కారణాలు విశేష్యమైనవి కాకపోవచ్చు ‘ప్రాంతీయ’భావం అప్పుడు లేకపోవచ్చు కాని అది జరిగిన ప్రదేశం మాత్రం విశేష్యమైనదే. మనం పొరుగునవుండి తగవుపడకుండా పరస్పరం సహరించుకుంటూ అభివృద్ది చెందుదామని ఒకటైనవారం.అలాంటి చోట అసమానతలకు అవకాశం ఇప్పించడం మనం ఏర్పరుచుకున్న వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. దొంగ చేతికి కన్నంవున్న ఇల్లు దొరికినట్లు మనం  అప్పుడు చేసిన పొరపాట్లు ఇవాళ బుర్రలేని తిక్కసన్నాసులు ఎంత వీలైతె అంత స్వప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నారు.


అసలు 1969లోనే మహత్తరమైన సదవకాశం మనకువచ్చింది. వేర్పాటువాదం లేచిసద్దుమణిగినప్పుడు అందుక్కారణాలను వెతికి పరిష్కరించాల్సింది. ఓ చారిత్రిక అవకాశం రాజకీయ బురదలో కనుమరుగైంది. కొంతమేరకు తెలుగుదనం వికసించి ‘తెలుగువార’నే గుర్తింపు ప్రాంతీయ పార్టీఐన తెలుగుదేశం హయాంలో వచ్చింది.అలానే వుంటే బహుశా వేర్పాటువాదం కాలగర్భంలో కలిసిపోయేదేమో. పదవిరాలేదని ఒక్కడు మొదలుపెట్టిన యాగి అధిష్టానాన్ని సంతృప్తి పరచడానికి ఎంపీలను టోకుగా ఇచ్చేసిన ఇక్కడ భగవంతుడి పాలనలో పరిపూర్ణమైంది. ఒకవేళ వై.యెస్‌.ఆర్ వుండివుంటే KCR ఇంత సీన్ చేసేవాడుకాదేమో నెల-నెలన్న రోజులకోసారి చెప్పే సోది తప్పించి.


ఇప్పుడున్న సమస్యకు JPగారు ఓ విధంగా మంచి పరిష్కారమే సూచించారు "నిజంగానే విడిపోవాలనుకుంటే అలానేకానివ్వండి కాని ఒకళ్ళమీద ఒకళ్ళు విద్వేశాలు పెంచుకుంటూ కాదు,ఇలాంటి తరుణంలో వద్దు. కలిసేవుందాముకుంటే ప్రాంతీయ అసమానతలు రూపుమాపడానికి రీజనల్‌ కమిటీలు వేసుకుందాం, అధికార వికేంద్రీకరణ జరుపుదాం". కొట్టుకుంటూ విడిపోవడమో, ఏది తేలకుండా సద్దుమణిగాక మళ్లి తాడుబొంగరంలేని పూటకోమాటమార్చేటోల్ల చేతిలో విషయం నలగకుండా చూసుకుందాం


మా తెలుగు తల్లికి మల్లెపూదండా,
మాకన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి

గలగలా గోదారి కదిలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను....

నేను తెలుగువాడిగా పుట్టాను, తెలుగువాడిగానే వుంటా. స్వప్రయోజనం కోసం తెలంగాణాఅనో ఆంధ్రమనో అడ్డమైన గడ్డికరిచే సన్నాసులను నే లెక్కచేయను. 
మై తెలుగువాలా హై
---------------------------------------------------------------------------------------------------------------

PS- శరత'కాలమ్’: ఏం కెలుకుడుకి కొత్తపదం కనిపెడితివోగానిబాసు......దాన్ని కాస్తా కొత్త తిట్టుకింద వాడుకుంటూన్నారు జనాలు. కామేడికి మొదలుపెట్టింది కాస్తా సీరియసైపోయింది. pants off to you.....

మై తెలుగువాలా హై-1

ఎవరేమన్నాగాని
నేన్ తెలుగోడ్ని బై
నేను తెలుగువాడిని
నేను తెలుగోనబ్బా

ఓకె, పాయింట్‌కి వస్తున్నా. గతకొద్ది వారాలుగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలింగించేవిగా ఉన్నాయి. కలిసుండలేం విడిపోదాం అనొకరు, లేదు సమైక్యంగావుందామని మరొకరు చేస్తున్న ప్రయత్నాలు,ఉద్యమాలు ఒకరిపట్లఒకరికి నష్టం కలిగించేవిగావున్నాయి.తెలంగాణగూరించి ఉద్యమించేవాళ్ళు సీమాంధ్ర నాయకుల వైఖరిపట్ల కాకుండా అక్కడి సామాన్య ప్రజలపట్ల కూడా వ్యతిరేకంగా ప్రవర్తించడం, సమైక్యంఅనేవాళ్ళు కేవలం కలిసుందామని మాత్రమే అని పరిష్కారం చెప్పకపోవడం ఇలాంటివి అసలు విషయాన్ని జఠిలం చేస్తున్నాయనిపిస్తుంది.
ఈ సంఘటనలక్రమంలో నాకు కల్గిన అభిప్రాయాలను, కొన్ని ప్రశ్నలను ఇక్కడ పెడుతున్నాను.

సమైక్యవాదులకు

౧.తెలంగాణావాదులు తమ సమస్యకు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం మాత్రమే పరిష్కారం అని నిర్దిష్టంగా చెప్పినప్పుడు, మీ సమస్యల పట్ల అవగాహనా,సానభూతీవున్నాయి అయినా కలిసివుందామంటున్నారు. కలిసివుండి ఆ సమస్యలను ఎలా ఏ విధంగా పరిష్కరిస్తారో ఎందుకు చెప్పలేకపోతున్నారు.

౨.ఉద్యోగాల్లో ప్రాంతాలవారిగా కేటాయింపులకోసం తెచ్చిన GO.610,ముల్కీ నిభందనలు ఎందుకు అమలుకు నోచుకోలేదు. దాని అమలు తెరపైకి వచ్చిన ప్రత్తిసారి జేఏసి ఉద్యమాలు, ఫ్రీజోన్‌ లాంటివి ఎందుకు వస్తాయి. పోనీ 610 GO అమలొ విధానపరమైన నిర్ణయాలు(ఒకవేళ మరొక ప్రాంతానికి నష్టం కలిగేదిగా) తీసుకొనే ఉద్యోగాలు తప్పించి executive level ఉద్యోగాల్లో అయినా అమలైవుంటే KCR లాంటివాళ్ళు ఇంత దూరం వచ్చేవాళ్ళా?


౩.హైదరబాదు: ఎంతసేపూ తెలంగాణా కోరుకొనే వాళ్లు చెప్పే అన్నికారణాలను ఖండించడమేకాని సమైక్యాంధ్ర కోసం పసేలేని వాదన వినిపించేవాళ్లను పట్టించుకునేవాడేడి. ఎందుకంటున్నానంటే ‘సమైక్యం’వినిపించేవాళ్లలో హైదరాబాదుని మేం అభివృద్ధి చేశాం, అభివృద్దిలో సింహభాగం పాత్రపోషించాం , తెలంగాణా ఇచ్చేట్లయితే హైదరాబాదుని కూడా ప్రత్యేక రాష్ట్రం చేయాలనే వాళ్ళని ఏందుకు ప్రశ్నించరు? అంటే మనకు మద్దతిస్తున్నాడు కాబట్టి వాళ్ళుద్దెశేమైనా ఫరవాలేదనుకుంటున్నారా- అలాగైతే KCR సోనియాను పొగిడినా,తిట్టినా తప్పులేదు, మీ రాతలకి విలువలేదు.

౪.తెలబాను: ఏ లుచ్చాగాడు( seriously, i mean it) మొదలు పేట్టాడోగానీ తెలంగాణా కావాలనుకునేవాళ్ళను మొత్తం ఈ గ్రూపులో కలిపేసారు. ‘తెలబాను ఓ తెలబాను’ అని పాటలొకటి, మళ్ళీ వాటికి ప్రశంసలు. తెలంగాణావాదులేమైనా తాలిబాన్లలాగా అన్ని ప్రాంతాలు తమ అధికారంలోనే ఉండాలనేమైన అన్నారా. విలీనమైన రాష్ర్టం వద్దు తమని తాము పాలించుకునేలా ప్రత్యేక రాష్ర్టం కావాలనే అన్నారుగా, పోనీ ఇప్పటి వరకు ఎరైనా తెలంగాణేతరులకు ప్రాణహాని తలపెట్టారా. ప్రభుత్వ, కొన్నిఅతితక్కువ (అది కూడా అది-ఇది అని చూడని విధ్వంస పరంపరలో) సంఘటనల్లో సామాన్య ప్రజల ఆస్తుల ధ్వంసం జరిగింది. భయాందోళనలు కలిగించినమాట వాస్తవం. అయితే ఒకటి ‘భాగో-జాగో’ అని నాయకులు అన్నప్పుడు పెద్దగా ప్రమాదంగా పరిగణించలేదు, ఖండించడం తప్పిస్తే. బస్సు దహనాలు, ఆస్తుల ధ్వంసం జరిగినప్పుడు ఒక్క సీమాంధ్ర ప్రజలేకాదు తెలంగాణా ప్రజలు కూడా భయపడ్డారు. ఆమాత్రందానికే ‘తెలబాను’ అనేబిరుదు, దాన్ని వాదుకుంటూ వ్యాసాలు.
ఒకవేళ ఈ పదం మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధులు అన్న మాటల తరువాత పుట్టివుంటే,వాళ్ళను ఉద్దేశించి అనివుంటే, అలాఅనడాన్ని ప్రశంశిస్తే అంతగా బాధపడేవాడ్నికాదు. ప్రత్యేకం కావాలన్నందుకే ‘తెలబాను’ పుట్టాడు, దానికి అనుబంధంగా ‘T-ఇడియట్స్’ , దీన్ని విమర్శించే సమైక్యవాది ఒక్కడుండడు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొనే సమైక్యరాగం ఏంటో నాకర్థంకావట్లా.

౫.హింస: ప్రత్యేక ఉద్యమంలో ఉమ్మడి ఆస్తి (బస్సులు, ప్రభుత్వ కార్యాలయాలు) ధ్వంసం అవుతున్నాయి, ఇది ద్వేషపూరిత ఉద్యమం తప్పితే నిజమైన ఉద్యమం కాదని చాలా బ్లాగుల్లో అన్నారు. మీతో నేను ఏకీభవిస్తున్నా-విధ్వంసం సరైందికాదని. ఈ హింసని విమర్శించిన వాళ్ళు సమైక్యోద్యమంలో భాగంగా BSNL ఆఫీసుకి, పోలీసు స్టేషన్లకీ నిప్పు పెట్టినప్పుడు, యూనివర్సిటీలో (SVU అనుకుంటా) labs ధ్వంసం చేసినప్పుడు, ఆయిల్ రిఫైనరీలు ముట్టడించినప్పుడు ఏందుకు నోరు మెదపలేదు. సమైక్యంకోసం చేస్తే అది నిజమైన ప్రబలమైన కోరిక వ్యక్తం చేసినట్లు, తెలంగాణాలొ చేస్తే అది విద్వేషపూరితమైనదా ?

౬.కేసిఆర్: ప్రత్యేక రాష్ర్టం వద్దనుకునేవాళ్ళు విషయం తెలియకపోయినా తెలంగాణావాదానికి వ్యతిరేకంగా మాట్లాడ్డానికి ఓ మాంచి పాయింట్‌. KCRమాత్రమే తెలంగాణా అంటున్నాడంటారు. వాణ్ణి (ఎందుకంటే తెలంగాణాలో తెలంగాణాకొసమే kcrని చాలామంది సమర్థిస్తున్నారుకాని KCRనచ్చికాదు) తిడుతూ మొత్తం తెలంగాణావాదమే లేదంటున్నారు. ప్రత్యేక భావమేవుంటే 2009 ఎన్నికల్లో ఎందుకు ఓట్లు సంపాదించలేదు,గ్రేటర్లో ఎందుకు నిలబడలేదు అని అడిగేవాళ్ళు అసలు 2009 ఎన్నికల్లొ ఎన్ని పార్టీలు తెలంగాణాను తమ ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టాయి, ఎన్ని పార్టీల అధినాయకులు తెలంగాణాకి సానుకూలమి చెప్పాయి, 2004 తరువాత కరీంనగర్ ఉపఎన్నికల్లో సదరు KCR ‘తెలంగాణా’అనే ఒకేఒక ఎజెండాతో పోటిచేసినప్పుడు ఎంత మెజార్టీతో గెలిచాడొ ఆ తరువాత మళ్ళి పోటీ చెసినప్పుడు ప్రజలు అతణ్ణి తిరస్కరించారా తెలంగాణా భావాన్ని తిరస్కరించారా అని ఆలోచించరేం?
ఇప్పుడు KCRకి వ్యతిరేకంగా మాట్లాడే నాయకగణం, యూనియన్లూ,సంఘాలు 2004,2009 ఎన్నికలప్పుడు ఏమయ్యారు? పొత్తుపెట్టుకున్న నాయకులని ఎందుకు నిలదీయలేదు? KCR ప్రవర్తనపైన అతని అంతరంగంపైన మాట్లాడిన సదరు వక్తలు లగడపాటి లాంటి psuedo సమైక్యవాదులగూరించి మాట్లాడరేం?


తెలంగాణావాదులకు
౧. మీరు తెలంగాణా కావాలీ అనేప్రతిసారి ఇంకోప్రాంతపు నాయకుల అధికార వివక్ష గురించి గాకుండా అక్కడి మొత్తం ప్రజలపట్ల వ్యతిరేకంగా ఏందుకు ప్రవర్తిస్తారు. అక్కడి ప్రజలు జీవనోపాది కోసం ఇక్కడికి వచ్చిర్రుగాని వనరులు దోచుకోడంకోసం కాదే, అలావచ్చింది నాయకులు. ఆల్లకు వ్యతిరేకంగా మాట్లాడుండ్రి. గంతేగాని ‘ఆంధ్రవాలా భాగో’, ‘ఆంధ్రోల్లని తరిమిగోడ్తం’ అని ఎవడో అంటె ఏమనరు, తెలంగాణాకు ఎదురు మాట్లాడితే నారాజ్‌ ఐతరు. ఏంది వయా ఇది?

౨. సమజ్‌గాక అడ్గుతున్న ‘ఆంధ్ర బ్యాంక్‌’ అనె పేరువుంటే గది ఆంధ్రోళ్లు పెట్టిందైతదా? దాని ఆఫీసు బర్బాద్‌ చేశిండ్రు. ఏమన్న ధమాక్‌ఉన్న పనేనా. KCR దీన్ని మంచిపనే అంటె సవాల్‌ జేసిన తెంగాణావాదిలేడు. ఏందిబై ఇది.

౩. మొన్న ఉస్మానియాల ‘ సంక్రాంతి పండగకి సొంతూరు పొయ్యేవాళ్ళు మళ్ళి తిరిగి రాకండి’ అన్నరు. గదేమన్న సరైందా? మీ బండ్లకు AP బదులు TG అని పెట్టిండ్రుసరే మంచి పని వేరోళ్లకు నష్టం లేదు. మీ అంతరంగం చెప్పారు. అంతేగాని ఆల్లని రానియ్యం, పారిపోండ్రి అనేదేందివయా...


సశేషం...

సొగసు చూడతరమా....



రష్యాలో కనపడే సైబేరియన్‌ పులి ఇది. మన బెంగాల్‌ పులులు రాజసానికి పెట్టింది పేరైతే సైబేరియన్‌ పులులు చూడ్డానికి అందంగా వుంటాయి. చలి ప్రదేశాల్లొ నివాసం కాబట్టి చర్మం మీది వెంట్రుకలు దట్టంగా, ముదురు రంగులో ఉంటాయి. ముదురు గోధుమ రంగుపైన నల్లని చారలతో గ్లామరస్‌గా ఉంటాయి. ఫోటొ జూస్తే తెలుస్తలే..
అడవుల నరికివేత, మనుషుల వేట కారణంగా వీటి సంఖ్య ప్రమాదంలో పడిపోయింది.
ఫోటొ విషయానికి వస్తే ఈ pose లొ బంధించడానికి ఫొటొగ్రాఫర్‌ గంటల తరబడి దాని చుట్టుపక్కనే ఉండాల్సి వచ్చిందట. చాలా దగ్గరినుండి తీసాడంట...ఎలా ఉండగలిగాడో మరి.


పెపంచకంలో ఇంతకన్నా సుఖమైన పని ఏమైనా ఉంటుందా బాబయ్యా.
ఏ చేప పిల్ల దొరికిందని కలగంటుందో ఏంటొ...డిస్టర్బ్‌ చేయకండి

ద్రువపు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే సీళ్ళ చర్మం కోసం, వాటి కొవ్వు నుండి తీసే నూనెల కోసం ఒకప్పుడు వీటిని విచ్చలవిడిగా చంపేసేవారు.



హిమాలయాలు, నేపాల్, చైనా ప్రాంతంలో కనపడే ఎర్ర పాండాలు ఇవి. Fire Fox అనికూడా అంటారు. నలుపు-తెలుపు పాండాల దగ్గరి పొలికల్తో ఉంటుంది. వాటిలాగే శాకాహార జీవి. అధికారిక లెక్కల ప్రకారం వీటి జనాభా సుమారు 2500.
అడవుల నిరికివేత కారణంగా వీటి మనుగడ ప్రమాదంలో పడింది.








కోరల్‌ రీవ్స్‌...భూమిపైన జలంతర్భాగంలో ఉండే స్వర్గం. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిస్కవరీలోనో, Nat Geoలోనో చూసేఉంటారు. వీటి చుట్టుపక్కల ఉండే జీవవైవిద్యం ఎక్కడా ఉండదు. సెంటీమీటరు సైజు చేపల నుండి పదడుగుల పొడవుండె షార్క్‌ చేపల వరకు అన్నీ కనిపిస్తాయి. భూవాతావరణంలోని ఉష్ణొగ్రతల మార్పులకు చాలా ప్రభావితమౌతాయి. సముద్రపు ఉప్పు శాతం పెరిగినా, సాధారణ ఉష్ణోగ్రత పెరిగినా ఇవి దెబ్బతింటాయి.



ఉత్తర, దక్షిణ అమేరికాలలో ప్రముఖంగా కనిపించే కౌగార్‌ పెద్దపిల్లులో నాలూగో అతిపెద్దది ( పులి, సింహం, జాగ్వార్‌ ల తరువాత ). ఇప్పటికైతే వీటి మనుగడకొచ్చిన ముప్పేమీలేదని WWF చెబుతుంది. కానీ కొన్ని అమెరికా రాష్ట్రాలలో వీటిని వేటాడటం చట్టబద్దమేనట. ఆ రకంగా ప్రమాదంలో ఉంది.








తలమే బ్రహ్మకునైన నీ నగమహత్వఁ బెన్న.....
( పదో తరగతిలో ‘ప్రవరుని స్వగతం’లో చదివిన పద్యం, వ్యాకరణ దోషాలేమైన ఉంటే మన్నించండి)

ఇంజనీరింజ్‌లో మేము మనాలీ వెళ్ళినప్పుడు తీసిన ఫోటొ . రోతాంగ్‌ పాస్‌ వేళ్ళే సమయానికి మంచు ఏక్కువ కురుస్తుందని ఆ దారి మూసేసారు.....చివరికి సోలాంగ్‌ valleyకు వేళ్ళాం.దారిలో తీసిన క్లిక్కు ఇది. హైదరాబాదులో చిన్న గుట్టలే చూసిన నాకు అంతంత పెద్ద కొండలు చూసేసరికి ఎవరూ కొట్టకుండనే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాకైంది. తెల్లటి మంచుకొండలపైన ఎండపడి వెలిగిపోతుంటే......చూడ్డానికి నాలుగు కళ్లు చాలలేదు ( నాకు కళ్ళజోడు ఉందిమరి).
పెరిగిపోతున్న భూవాతావరణం కారణంగా వీటిపైన ఉండే మంచు త్వరగా ( ఎండాకాలం ముందుగానే) కరగుతుందంట.
ఇలాగే కొనసాగితే మున్ముందు అక్కడ రాళ్లకొండలే ఉంటాయి కాబోలు.

టాపా రాస్తుంటే winampలో ‘ఓయ్!’ సినిమా పాట ప్లే అవుతుంది...,
"అనుకోలేదేనాడు  ఈ లోకం నాకోసం
అందంగా ముస్తాబైవుంటుందనీ...."
నాకోసం సరే అందంగానే ఉంది......కాని వచ్చే తరానికి.....?
వీటి సొగసు రానున్న తరాలు చూడశక్యమా......

‘మద్య’వర్తి.....

వారం రోజుల క్రితం గుజరాత్‌లో కల్తీమద్యం తాగి సుమారు 130 మంది మరణించారు. గుజరాత్‌ రాష్ట్రంలో 1961 నుండి మద్యనిషేదం అమల్లొవుంది. కాబట్టి సహజంగానే అక్రమ మద్యవ్యాపారం అక్కడ బాగానే జరుగుతుంది. దినికి బానిసలైనవారు ఎలాగూమానలేరు కాబట్టి వ్యాపారులు అక్రమ మద్యం తయారుచేయడం మాత్రమేకాక దాన్ని కల్తీ కూడా చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనత, అక్రమమద్య వ్యాపారుల స్వార్థం అన్నీ కలిసి ఇటీవలి మరణాలకి కారణం అయ్యాయి.
దీమిపైన చాలా దుమారమే చెలరేగింది. మద్యంపైన నిషేధం ఉన్నాక్కూడా అక్రమమద్యం ఎలా దొరుకుతుందనీ, అసలు గాంధీ రాష్ట్రంలో మద్యంతాగి ప్రజలు చనిపోవటం ఏంటని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నానాయాగి చేశాయి.


ఈ సిన్లో ఒకాయన చేసిన వ్యాఖ్య కొన్ని రోజులుగా నాకు చికాకు కలిగిస్తుంది ( తిక్కరేగ్గొడుతుంది అంటే బావుంటుంది ). సందట్లో సడేమియాలాగా ఆయనగారు తన వ్యాపారవ్యూహాలను ఇలాంటి సందర్భంలో దూర్చాలనుకోవడం మరీ రోతగా ఉంది. ఆ మనిషి ‘లిక్కర్‌కింగ్‌’గా పిలవబడే బిజినెస్‌ టైకూన్‌ విజయ్‌ మాల్యా.
సంఘటన జరిగిన కొన్ని రోజులకు కింగ్‌గారు విలేఖరుల సమావేశంలో ఈ విధంగా అన్నారు ,"మన రాజకీయ hyopocrites ఇకనైనా మేల్కోవలసిన సందర్భమిది. ప్రజలకు ఏం కావాలో వాళ్లే నిర్ణయం తీసుకునేటట్లు శాసనకర్తలు తగిన మార్పుచేస్తే బాగుంటుంది. ప్రభుత్వం మద్యనిషేదం విధిచడం వల్లనే ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం దీనిగురించి పునరాలోచించాలి ."

మొదటి రెండు వాక్యాలు పర్లేదు...మిగతా లైన్లతోనే తంటా వచ్చిపడింది. పోనీ పెద్దోళ్ళ మాటలను మీడియా వక్రీకరిస్తుంది అంటారుకదాని ఆ మాటలకుండగలిగే అర్థాలేంటో ఆలోచించాను. రెండు భావాలు చిరిగినాయి...అవి
మొదటిది:‘ప్రభుత్వం మద్యనిషేదం విధించింది కాబట్టి ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.....ప్రజలు స్వచ్ఛందంగా మానుంటే సమస్య లేదు’
రెండవది: ‘ ప్రభుత్వం మద్యనిషేదం విధించింది కాబట్టే ఇదంతా.....నిషేదం ఏత్తేస్తే వారికి (జనానికి) చట్టబద్దంగా నాణ్యమైన మద్యం దొరుకుతుంది......మరణాలుండవు. so, నిషేదం ఎత్తేయాలి’
మెడకాయ మీద తలకాయున్న ఎవరికైనా మాల్యా మొదటి అర్థంతో చెప్పాడంటే నమ్మరు.
ప్రభుత్వం కాకపోతే ఎవరు నిషేదం విధిస్తారు...? ‘సేన’లా, మత సంస్థలా......నో ఛాన్స్‌. ఒకవేళ విధించినాకాని ఈ కింగ్‌లోళ్లే కేసు వేసిమరీ అమ్మించుకుంటారు.

నిషేదం ఉన్నాకాని సచ్చినోళ్ళు తాగి సచ్చారంటే.....శానా బాగా ఎడిక్ట్‌ అయ్యుంటారు. గవర్నమెంటు మందమ్ముకునే లైసెన్సు ఇచ్చుంటే నా బీరురంగా....... ఐ.పీ.ఎల్‌ అవసరం లేకుండానె కుప్పలుగా డబ్బులొచ్చేవని బహుశా కింగ్‌ అనుకొని ఉంటాడు. పైకి చెప్పలేక భారి డైలాగులు పేల్చాడు.
దీన్నిగూర్చి ఆలోచిస్తుంటే సామాన్య ప్రజలకు మన దేశంలో మద్యం అమ్మడం అవసరమా అన్న ప్రశ్న వచ్చింది. ఇది ఎందుకంటే మా ఏరియాలో బస్టాపు దగ్గరే ఓ మందు దుకాణం ఉంది. దానికి కొంచెం దూరంలో జూనియర్ కాలేజి ఉంది (ప్రభుత్వం నిర్దేశించిన దూరానికి ఓ పది మీటర్ల అవతల). సాయంత్రం అయ్యిందంటే దుకాణం దగ్గర జాతర జరుగుతుంది. పీకలదాకా తాగినోళ్ళు, తాగాలనుకుంటున్నోళ్ళు అంతా అక్కడే. అదే టైముకి కాలేజి వదలడం. ఆ బస్టాపులో ఎలా wait చేస్తారో వాళ్లు. సరిహద్దుల్లో ఉండే జవాన్లుకు, అపర దేవదాసులకైతే ఫరవాలేదు- అమ్మినా వాళ్ళ పనేదో అది చేసుకుపోతారు. ఎటొచ్చీ మిగతా వాళ్లకే అవసరమా. మానదా ఎదో కొన్ని నెలలు తప్పితే సంవత్సరాంతం చలి దారుణంగా ఉండే దేశంకాదు ( మందు బాబులను ఎందుకు తాగుతున్నావురా అంటే మూడొంతుల మంది చెప్పే జవాబు ఇదే- ఒళ్ళు వేడి చేసుకోడానికి) ఐనా తాగుతారు.... తాగి రభస చేయడానికి, ఎక్కువైనోడు చచ్చి ఇలా ఈవిధంగా ‘మద్య’వర్తిలు నోరొపారేసుకోడానికి, నాయకులుతో వారి కుటుంబాలు పరామర్శించబడటానికి.

ShareThis